హైదరాబాద్ : హైదరాబాద్ శివార్లలోని జంట జలాశయాలు ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్కు వరద కొనసాగుతోంది. గత నాలుగైదు రోజుల నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు జలాశయాలు కళకళలాడుతున్నాయి.
ఉస్మాన్ సాగర్ జలాశయం ఇన్ఫ్లో 300 క్యూసెక్కులుగా ఉంది. వరద నేపథ్యంలో ఉస్మాన్ సాగర్ 2 గేట్లు ఎత్తి 208 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు. ప్రాజెక్టు ప్రస్తుత నీటిమట్టం 1,786 అడుగులు కాగా, పూర్తిస్థాయి నీటిమట్టం 1,790 అడుగులు.
హిమాయత్ సాగర్ 500 క్యూసెక్కుల ఇన్ఫ్లో వస్తుంది. ప్రాజెక్టు 2 గేట్లు ఎత్తి 686 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. హిమాయత్ సాగర్ ప్రస్తుత నీటిమట్టం 1760.55 అడుగులు కాగా, పూర్తిస్థాయి నీటిమట్టం 1763.50 అడుగులు. ఈ రెండు జలాశయాల పరివాహక ప్రాంతాల్లో ఉన్న ప్రజలను అధికారులు అప్రమత్తం చేస్తున్నారు. భారీ వరద నేపథ్యంలో లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు.