ఉప్పల్, నవంబర్ 24 : రాత్రి సమయాల్లో రోడ్లపై సంచరించే గోవులను చోరీ చేస్తున్న 5 మంది ముఠా సభ్యులను నాచారం పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. గురువారం పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసి న విలేకరుల సమావేశంలో సీఐ కిరణ్కుమార్తో కలిసి మల్కాజిగిరి ఏసీపీ నరేశ్రెడ్డి వివరాలు వెల్లడించారు. నాచారానికి చెందిన పాలవ్యాపారి వెంకట్రెడ్డికి చెందిన 5 ఆవులు కనిపించడంలేదంటూ నవంబర్ 15న ఫిర్యా దు చేయగా..
పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఇందులో భాగంగా 80 సీసీ కెమెరాలు పరిశీలించి.. నిందితులను గుర్తించారు. ఆటోడ్రైవర్గా పనిచేసే కిషన్బాగ్ బహదూర్పురకు చెందిన మహ్మద్ ఆయూబ్, మహ్మద్ బాబా, చాంద్రాయణగుట్ట పూల్బాగ్కు చెందిన మహ్మద్ ఆయూబ్ ఖురేషి, మహ్మద్ రఫీక్, ఆటోడ్రైవర్ సద్దాం ఖురేషీలను అదుపులోకి తీసుకున్నారు. విచారణ లో.. చోరీ చేసిన ఆవులను బంజారాహిల్స్లోని ఇమ్రాన్నగర్కు వాహనంలో తరలించేవారు.
అనంతరం పశువు ల మాంసాన్ని వివిధ ప్రాంతాల్లోని దుకాణదారులకు విక్రయించేవారు. ఈ రకంగా వచ్చిన డబ్బులను జల్సాలకు ఖర్చుచేసేవారు. నిందితులు వివిధ పోలీస్స్టేషన్ల పరిధిలో 8 పశువులు చోరీ చేసినట్లు గుర్తించారు. వారి నుం చి వింగర్ వాహనం, తూకం మిషన్, 6 కత్తులు, 8 మొబైల్ ఫోన్లతోపాటుగా రూ.2.5 లక్షలు నగదు స్వాధీనం చేసుకున్నారు.