హైదరాబాద్: నగరంలోని నానక్రామ్గూడలో (Nanakramguda) అర్ధరాత్రి అగ్నిప్రమాదం సంభవించిది. ఓ అపార్ట్మెంటు సెల్లార్లోని విద్యుత్ ప్యానెల్ బోర్డు దగ్గర షార్ట్ సర్క్యూట్ అయింది. దీంతో ఒక్కసారిగా మంటలు అంటుకున్నాయి. మంటలు ఎగసిపడుతుండటంతో భయాందోళనతో అపార్ట్మెంట్ వాసులు బయటకు పరుగులు తీశారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంధి ఘటనా స్థలానికి చేరుకున్నారు. నాలుగు గంటలపాటు శ్రమించి మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. 24వ అంతస్తులో చిక్కుకున్న నలుగురిని కాపాడారు. అయితే ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. ఈఘటనపై కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.