గౌతంనగర్, డిసెంబర్ 6 : మైనంపల్లి సోషల్ సర్వీస్ ట్రస్టు .. పేదలకు వైద్యం అందించడం, ఆదుకోవడంలో ముందు ఉంటుందని మల్కాజిగిరి నియోజకవర్గ టీఆర్ఎస్ మీడియాసెల్ కన్వీనర్ గుండా నిరంజన్ అన్నా రు. మంగళవారం మౌలాలి డివిజన్, గణేశ్నగర్కు చెం దిన చింతల మాలిక్ 7 ఏండ్లుగా మొదడువాపు వ్యాధితో బాధపడుతున్న విషయాన్ని మల్కాజిగిరి స ర్కిల్ టీఆర్ఎస్ ఎస్సీ సెల్ అధ్యక్షుడు మంద భాస్కర్.. ఎంఎస్ఎస్వో చైర్మన్ మైనంపల్లి హన్మంతరావు దృష్టికి తీసుకవెళ్లారు. ఆయన సూచన మేరకు మంగళవారం ఈస్ట్ ఆనంద్బాగ్లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం లో మాలిక్ తండ్రి విజయ్కుమార్కు రూ.36వేల చెక్కు ను అందజేశారు. ఈ సందర్భంగా నిరంజన్ మాట్లాడు తూ.. ఎమ్మెల్యే మైనంపల్లి దృష్టికి వచ్చిన ప్రతి సమస్యను పరిష్కరించి, ఎంఎస్ఎస్వో ట్రస్టు ద్వార పేదల కు ఆర్థిక సహాయాన్ని అందిస్తున్నారని తెలిపారు. ఎ మ్మెల్యే మైనంపల్లి , ఎంఎస్ఎస్వో చైర్మన్ రోహిత్బాబు లు ప్రజలను ఆదుకుంటున్నారని తెలిపారు. ఎమ్మెల్యే పీఏ స్వామి, సైదులు, కుమార్ పాల్గొన్నారు.