మన్సూరాబాద్, జనవరి 17: నిరుపేద విద్యార్థుల ఉన్నత చదువులకు ఉప్పల ఫౌండేషన్ ద్వారా చేయూతనిచ్చి వారి ఉజ్వల భవిష్యత్తుకు పునాదులు వేస్తున్నట్లు తెలంగాణ రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్తా తెలిపారు. నగరంలోని దమ్మాయిగూడకు చెందిన పేద ఆర్యవైశ్య కుటుంబంలోని నూకల వీరేశ్, భాగ్యలక్ష్మి దంపతుల కుమార్తె నిహారిక డిగ్రీ మొదటి సంవత్సరం, ప్రవళిక ఇంటర్ చదువుతున్నారు. కుటుంబంలో తలెత్తిన ఆర్థిక ఇబ్బందుల వలన వారి ఉన్నత చదువులకు ఇబ్బందులు ఏర్పడింది. విషయాన్ని కొందరు ఆర్యవైశ్య సంఘం నాయకులు ఉప్పల శ్రీనివాస్ గుప్తా దృష్టికి తీసుకెళ్లారు. వెంటనే ఆయన స్పందించి సంస్థ ద్వారా ఒక్కొక్కరికీ రూ. 10 వేల చొప్పున ఉప్పల శ్రీనివాస్ గుప్తా ఆర్థిక సహాయం అందజేశారు. ఈ కార్యక్రమంలో పలువురు ఆర్యవైశ్య సంఘం నాయకులు పాల్గొన్నారు.
డైరీని ఆవిష్కరణ..
తెలంగాణ ప్రైవేటు ఉద్యోగ సంఘం (టీపీయూఎస్) ఆధ్వర్యంలో సోమవారం నాగోల్లో ఏర్పాటు చేసిన సమావేశంలో రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్తా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో సంఘం కేంద్ర కమిటీ అధ్యక్షుడు గంధం రాములు, సలహాదారుడు కోల శ్రీనివాస్, సోషల్ మీడియా ఇన్చార్జి మోహన్నాయక్, బ్యాంకింగ్ ఇన్చార్జి రవీందర్ సింగ్, రాష్ట్ర ఉపాధ్యక్షుడు షేక్ జహీర్, తదితరులు పాల్గొన్నారు.