కొండపోచమ్మ సాగర్ నుంచి ఉస్మాన్ సాగర్(గండిపేట)కు గోదావరి జలాలు తరలిస్తామని మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో సోమవారం మంత్రి కే.తారక రామారావు అధ్యక్షతన 64వ సిటీ కన్వర్జెన్స్ (సమన్వయ)సమావేశం నిర్వహించారు. మంత్రులు ఎర్రబెల్లి దయాకర్రావు, సత్యవతి రాథోడ్, శ్రీనివాస్గౌడ్, కలెక్టర్లు, అధికారులు పాల్గొన్న సమావేశంలో మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ మంచిరేపుల నుంచి నాగోల్ గౌరెల్లి వరకు స్కై వేతో పాటు మూసీ నదిపై 14 చోట్ల బ్రిడ్జిల నిర్మాణ పనులకు టెండర్లను ఆహ్వానించనున్నామని ప్రకటించారు. పాతబస్తీలో రహదారుల విస్తరణకు రూ. 150కోట్లు కేటాయించామన్న ఆయన కొత్త డంపింగ్ యార్డులకు స్థలాలు గుర్తించాలని అధికారులను ఆదేశించారు. రాబోయే మూడేండ్లలో హైదరాబాద్లో అంతర్జాతీయ స్థాయి అభివృద్ధి జరుగుతుందని, మహానగర రూపురేఖలు మార్చేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ మదిలో అనేక ప్రణాళికలు ఉన్నాయని చెప్పారు. ప్రజాసమస్యల పరిష్కారంలో జీహెచ్ఎంసీది పెద్దన్న పాత్ర అని, మున్సిపల్ కార్యాలయాల్లో ఎలక్ట్రిక్ చార్జ్ స్టేషన్లు ఏర్పాటు చేస్తామని చెప్పారు.
సిటీబ్యూరో, ఆగస్టు 7 (నమస్తే తెలంగాణ ) : రాబోయే మూడేళ్లలో హైదరాబాద్ రూపురేఖలు మరింత మారిపోనున్నాయని పురపాలక, ఐటీ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు అన్నారు. అంతర్జాతీయ స్థాయిలో హైదరాబాద్ను సీఎం కేసీఆర్ అభివృద్ధి చేసే యోచనలో ఉన్నారని వివరించారు. మూసీ నది సుందరీకరణ, నది ఒడ్డున ట్రామ్, మంచిరేపుల నుంచి నాగోల్ గౌరెల్లి వరకు స్కై వేతో పాటు మూసీ నదిపై 14 చోట్ల బ్రిడ్జిల నిర్మాణ పనులకు టెండర్లను ఆహ్వానించనున్నామని కేటీఆర్ ప్రకటించారు. ఈ నెల 15 నుంచి 2బీహెచ్కే లబ్ధిదారులకు ఇండ్ల పంపిణీ జరుగనున్నదని, సర్వే ప్రక్రియను పూర్తి చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. బేషజాలకు వెళ్లకుండా ఏ శాఖ అధికారులైనా జీహెచ్ఎంసీ అనుమతి తర్వాతనే నిర్ణయాలు తీసుకోవాలని, జీహెచ్ఎంసీ పెద్దన్న పాత్ర పోషిస్తున్నదని తెలిపారు. జోనల్ స్థాయిలో సమన్వయ సమావేశం నిర్వహించి, జోనల్ పరిధిలోని అంశాలను అకడే పరిషరించుకోవాలన్నారు. నిర్దేశించిన గడువులోగా పనులు పూర్తి చేసుకోవాలని కేటీఆర్ తెలిపారు.
హైదరాబాద్ ప్రజల సమస్యల పరిషారంలో జీహెచ్ఎంసీ ముఖ్య పాత్ర పోషిస్తున్నదని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు.. సోమవారం జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో మంత్రి కేటీఆర్ అధ్యక్షతన 64వ సిటీ కన్వర్జెన్స్ (సమన్వయ)సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, మహిళా శిశు గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్, రాష్ట్ర క్రీడలు, ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్, పురపాలక శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ అరవింద్ కుమార్, మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ శ్రీలత శోభన్ రెడ్డి, జీహెచ్ఎంసీ కమిషనర్ రోనాల్డ్ రోస్, జలమండలి ఎండీ దానకిశోర్, మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి, టీఎస్ పీడీసీఎల్ సీఎండీ రఘుమారెడ్డి, హైదరాబాద్, రంగారెడ్డి, సంగారెడ్డి జిల్లాల కలెక్టర్లు, ముగ్గురు పోలీసు కమిషనర్లు, జీహెచ్ఎంసీ, ఇతర శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
50 ఏళ్ల అంచనాకు తగ్గట్టుగా డంపింగ్ యార్డులు
సమన్వయంతో అన్ని శాఖల అధికారులు ఒక దగ్గర ఉండాలనే లక్ష్యంతో వార్డు ఆఫీస్లను ఏర్పాటు చేశామని మంత్రి కేటీఆర్ తెలిపారు. బేషజాలకు వెళ్లకుండా ఏ శాఖ అధికారులైనా జీహెచ్ఎంసీ అనుమతి తర్వాతనే నిర్ణయాలు తీసుకోవాలని ఆదేశించారు. జవహర్నగర్ డంపింగ్ యార్డ్ 8వేల టన్నులు దాటిపోయిందని, డంప్ యార్డుల కోసం భూమిని గుర్తించాలని రంగారెడ్డి, సంగారెడ్డి, యాదాద్రి భువనగిరి కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు. ప్రజలకు ఇబ్బందులు లేకుండా డంప్ యార్డ్లు ఏర్పాటు చేసుకోవాలని, జనావాసాలకు దూరంగా ఉండేలా, హైదరాబాద్కు 50 ఏళ్ల వరకు ఇబ్బందులు లేకుండా చూసుకోవాలని తెలిపారు. వచ్చే చెత్తను వేరు చేసేందుకు, విద్యుత్ ఉత్పత్తి చేసేలా ఉండాలన్నారు. ముఖ్యంగా వ్యవసాయానికి యోగ్యత లేని భూములు గుర్తించాలని మంత్రి కేటీఆర్ తెలిపారు. క్వారీలను ఉపయోగించుకునే అవకాశాలను పరిశీలించాలని పేర్కొన్నారు. దుండిగల్, ఖానాపూర్, ప్యారానగర్ డంప్ యార్డ్ల అంశంలో వారంలో పూర్తి నివేదిక సమర్పించాలన్నారు. సి అండ్ డి ప్రైవేట్ డంపు యార్డు నిర్వహిస్తున్న వారిపై కఠినంగా వ్యవహరించాలని, అవసరమైతే పోలీస్ కేసులు పెట్టాలని జీహెచ్ఎంసీ అధికారులను ఆదేశించారు. జోనల్ స్థాయిలో సమన్వయ సమావేశం నిర్వహించి, జోనల్ పరిధిలోని అంశాలను అకడే పరిషరించుకోవాలన్నారు. నిర్దేశించిన గడువులోగా పనులు పూర్తి చేసుకోవాలని కేటీఆర్ తెలిపారు.
పిల్లలను కాపాడుకోవాల్సిన బాధ్యత మన అందరిది..
కొండపోచమ్మ సాగర్ నుంచి ఉస్మాన్సాగర్కు నీళ్లు తరలించవచ్చని.., దీంతో మూసీనదిలో ప్రవాహమంతా మంచి నీళ్లుగా మారుతాయన్నారు. అంతర్జాతీయ స్థాయిలో హైదరాబాద్ను సీఎం కేసీఆర్ అభివృద్ధి చేసే యోచనలో ఉన్నారని వివరించారు. రాబోయే మూడేళ్లలో హైదరాబాద్ రూపు రేఖలు మారిపోనున్నాయని తెలిపారు. మూసీ నది సుందరీకరణ, నది ఒడ్డున ట్రామ్, నదిపైన ఫ్లై ఓవర్ల నిర్మాణం జరగాలని తెలిపారు. జీహెచ్ఎంసీ పరిధిలోని పబ్లు, హుకా సెంటర్లు, పాఠశాలలు, ఫామ్ హౌస్ల చుట్టూ పోలీసుల నిఘా పెంచాలన్నారు. గంజాయి విక్రయాలపై ఉకుపాదం మోపాలన్నారు. సీసీ కెమెరాలు పెట్టి కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. పిల్లలను కాపాడుకోవాల్సిన బాధ్యత మన అందరిపై ఉన్నదని చెప్పారు. మాదకద్రవ్యాల అలవాట్లు తీవ్రమైన నేరాలకు కారణం అవుతాయని తెలిపారు. చిరు వ్యాపారస్తులకు ప్రత్యేకంగా స్ట్రీట్ వెండింగ్ జోన్లు ఏర్పాటు చేయాలన్నారు.
పాతబస్తీలో రహదారులకు రూ.150కోట్లు
పాత బస్తీ రోడ్ల విస్తరణకు కేటాయించిన రూ.150 కోట్లు వినియోగించుకోవాలని మంత్రి కేటీఆర్ తెలిపారు. ఓల్డ్ సిటీలో ప్రజలతో మమేకమై పని చేయాలని, మంచి ఫలితాలు వస్తాయని చెప్పారు. మూసీ నదిపై 14 బ్రిడ్జిలకు త్వరలో శంకుస్థాపన చేయాల్సి ఉందని, ఇందుకోసం శాఖల పరిధిలోని అంశాలు పూర్తి చేయాలన్నారు. 14 బ్రిడ్జిలకు త్వరలో టెండర్లు పూర్తి చేయాలని సూచించారు. ఔటర్ రింగ్ రోడ్డు ఒక వైపు నుంచి మరోవైపు సిటీ మధ్య నుంచి 4, 6 లేన్ల ఎక్స్ ప్రెస్ వే ప్రణాళిక చేయడం జరిగిందని పేర్కొన్నారు.
ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని ప్రోత్సహించాలి
మల్టీ లెవల్ పారింగ్కు ప్రణాళిక చేయాలని అధికారులను మంత్రి కేటీఆర్ ఆదేశించారు. జీహెచ్ఎంసీ పరిధిలో ప్రభుత్వ ఖాళీ స్థలాలతో పాటుగా ప్రైవేట్ స్థలాలను గుర్తించాలన్నారు. నాన్ మోటరైజ్డ్ ట్రాన్స్ పోర్ట్ను ప్రోత్సహించేందుకు చర్యలు చేపట్టాలని సూచించారు. అవసరం ఉన్న చోట సై వాక్ల నిర్మాణం చేపట్టాలని తెలిపారు. గూగుల్ స్ట్రీట్ వ్యూ సమన్వయంతో జీహెచ్ఎంసీ యాప్ డెవలప్ చేయాలని, యాప్లో అన్ని వివరాలు అందుబాటులోకి తేవాలన్నారు. నగరంలో మున్సిపల్ కార్యాలయాల పరిధిలో ఎలక్ట్రానిక్ ఛార్జ్ స్టేషన్లను ఏర్పాటు చేయాలని తెలిపారు. ఉద్యోగులు, సిబ్బంది ఎలక్ట్రిక్ వాహనాలు వినియోగించేలా ప్రోత్సాహించాలన్నారు. రహదారులపై యూటర్న్ల ఏర్పాటు అంశంలో ట్రాఫిక్ పోలీసులు ముందుగా జీహెచ్ఎంసీ అధికారులకు సమాచారం అందించాలని సూచించారు.