సిటీబ్యూరో, జూన్ 8(నమస్తే తెలంగాణ) : ఏపీ హై-కోర్టు ఉద్యోగి హైదరాబాద్ అత్తాపూర్ ప్రాంతంలో నివాసముంటున్నాడు. అతడికి తన కుమారుడితో కలిపి ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్లో జాయింట్ ఖాతా ఉన్నది. ఇటీవల అతడి ఖాతా నుంచి రూ.2.43 లక్షలు తగ్గింది. దీంతో ఈ నగదును తన అల్లుడు కాజేశాడని అనుమానం వ్యక్తం చేశాడు.
అతడికి మాత్రమే తన డెబిట్ కార్డు పూర్తి వివరాలు తెలుసని, అతడిపై చర్యలు తీసుకోవాలని సైబరాబాద్ సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అల్లుడిపై రాజేంద్రనగర్ పీఎస్లో వరకట్న వేధింపులకు సంబంధించి ఫిర్యాదు చేయడంతోనే అతను తమను ఆర్థికంగా దెబ్బకొట్టేందుకు తన ఖాతా నుంచి నగదు దోచుకున్నాడని బాధితుడు ఫిర్యాదులో పేర్కొన్నాడు.