Accident | హైదరాబాద్ : నార్సింగిలో ఓ కారు బీభత్సం సృష్టించింది. మై హోమ్ అవతార్ బిల్డింగ్ సమీపంలో బైక్ను కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైక్పై వెళ్తున్న వ్యక్తి మృతి చెందాడు. దీంతో కారు డ్రైవర్ పరారీ అయ్యాడు.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. మృతుడిని విజయ్గా పోలీసులు గుర్తించారు. బైక్ను కొద్దిదూరం కారు ఈడ్చుకెళ్లినట్లు పోలీసులు గుర్తించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.