Jeevan Daan | ఖైరతాబాద్, ఫిబ్రవరి 10: తాను మరణిస్తూ.. పలువురికి ప్రాణం పోశారు నిజామాబాద్ జిల్లా వినాయక్నగర్కు చెందిన ఎడ్ల గోపాల్ (55). టీఎస్ ఎన్సీడీసీఎల్లో సీనియర్ అసిస్టెంట్గా పనిచేస్తున్న ఆయన..మూడు రోజుల కిందట ఇంట్లో ఒక్కసారిగా కుప్పకూలిపోయి అపస్మారక స్థితికి చేరుకున్నారు. కుటుంబసభ్యులు సికింద్రాబాద్లోని యశోద దవాఖానకు తరలించారు.
చికిత్స అందిస్తున్న వైద్యులు.. ఈనెల 9 న బ్రెయిన్ డెడ్కు గురైనట్లు నిర్ధారించారు. జీవన్దాన్ ప్రతినిధులు కుటుంబసభ్యులను కలిసి అవయవదాన విశిష్టతను వివరించగా, అందుకు వారు అంగీకరించారు. గోపాల్ నుంచి కాలేయం, రెండు మూత్రపిండాలు స్వీకరించారు. అవయవదానానికి ముందుకొచ్చిన కుటుంబసభ్యులను జీవన్దాన్ ప్రతినిధులు అభినందించారు.