హయత్నగర్, జూన్ 11: ఎలాంటి అనుమతులు లేకుండా నిర్వహిస్తున్న విత్తనాల కేంద్రంపై ఎల్బీనగర్ ఎస్ఓటీ పోలీసులు దాడులు నిర్వహించారు. కంపెనీ యజమానితోపాటు 170 డబ్బాల మిర్చి విత్తనాలు స్వాధీనం చేసుకున్నారు. ఈ సంఘటన హయత్నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో శుక్రవారం చోటుచేసుకుంది. అగ్చికల్చర్ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. అబ్దుల్లాపూర్మెట్ మండలం పెద్దఅంబర్పేట మున్సిపాలిటీ పరిధిలోని పసుమాముల, కలానగర్లో యజమాని గోపాల్ ఎలాంటి అనుమతులు లేకుండా బిబో సీడ్స్ పేరుతో గోప్యంగా విత్తనాల కేంద్రాన్ని నిర్వహిస్తున్నారు. విషయం తెలుసుకున్న ఎస్ఓటీ పోలీసులు విత్తనాల కేంద్రంపై దాడులు నిర్వహించి యజమానితోపాటు రూ.65 లక్షల విలువైన 170 డబ్బాల మిర్చి విత్తనాలను స్వాధీనం చేసుకుని హయత్నగర్ పోలీస్ స్టేషన్కు తరలించారు.