అల్లాపూర్,ఫిబ్రవరి 3: నకిలీ నోట్లను చలామణి చేస్తున్న ఇద్దరు వ్యక్తులను అల్లాపూర్ పోలీసులు అరెస్టు చేశారు. ఇన్స్పెక్టర్ శ్రీపతి ఆంజనేయులు కథనం ప్రకారం… బోడుప్పల్కు చెందిన వనం లక్ష్మీనారాయణ(37) వృత్తిరీత్యా రియల్ ఎస్టేట్ చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. గచ్చిబౌలి మజీత్ బండకు చెందిన ఎరుకల ప్రణయ్ కుమార్(26) ప్రైవేట్ ఉద్యోగి.
వనం లక్ష్మీనారాయణ బోడుప్పల్లోని ఓ ఇంట్లో నకిలీ నోట్లు తయారు చేశాడు. శనివారం అల్లాపూర్ డివిజన్ పరిధిలోని ఖైత్లాపూర్ ఫ్లైఓవర్ ప్రాంగణంలో లక్ష్మీనారాయణ ఎరుకల ప్రణయ్కు నకిలీ నోట్లు ఇస్తుండగా బాలానగర్ ఎస్ఓటీ, అల్లాపూర్ పోలీసులు మాటువేసి పట్టుకున్నారు. వారి నుంచి రూ.4.05 లక్షల నకిలీ నోట్లు, ఒక ప్రింటర్, ల్యాప్టాప్, కట్టర్ పరికరాలను స్వాధీనం చేసుకుని రిమాండ్కు తరలించారు.