సిటీబ్యూరో, జనవరి 16 (నమస్తే తెలంగాణ) : వ్యాపారులను లక్ష్యంగా చేసుకొని హనీ ట్రాప్తో దోచేస్తున్న ఓ ఘరానా ముఠాను ముషీరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. సెంట్రల్ జోన్ డీసీపీ కార్యాలయంలో సోమవారం డీసీపీ రాజేశ్ చంద్ర వివరాలు వెల్లడించారు. ముషీరాబాద్కు చెందిన మహ్మద్ వికార్ మెహిదీ హోంగార్డుగా పనిచేసేవాడు. అతనిపై పలు కేసులు నమోదు కావడంతో 2016లో ఉద్యోగం నుంచి తొలగించి సస్పెక్టెడ్ షీట్ను తెరిచారు. కొంత మంది మహిళలు, పురుషులతో గ్యాంగ్ను ఏర్పాటు చేసి వ్యాపారులకు మహిళలతో వల వేశాడు. మహిళలు తమ అందాలతో ఫోన్లో మాట్లాడుతూ మైమరిపించి, రెస్టారెంట్లు, హోటళ్లలో కలుస్తారు. ఆ సమయంలో గ్యాంగ్ సభ్యులు ఫొటోలు, వీడియోలు తీసి వారిని బ్లాక్మెయిల్ చేస్తారు. బెదరని వారికి నకిలీ పిస్టోలు, కత్తులు చూపించి దోచుకుంటారు. ఇలా ముషీరాబాద్లో ఇద్దరు, సంతోష్నగర్, అసిఫ్నగర్లో ఒక్కొక్క వ్యాపారిని హనీ ట్రాప్ చేసి రూ. లక్షలు లాగేశారు. ఈ ముఠాలో 13 మంది ఉండగా 12 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి రూ. 1.5 లక్షల నగదు, రెండు డమ్మీ పిస్తోళ్లు, 10 కత్తులను స్వాధీనం చేసుకున్నారు. వికార్ ముఠాలో మహ్మద్ ఇమ్రాన్ ఖాన్ (బౌన్సర్లను సైప్లె చేస్తుంటాడు), మహ్మద్ ఇస్మాయిల్, మహ్మద్ అలీ, సైయిదా ఉజ్మా ఫాతిమా (జీవీకే మాల్లో సేల్స్ గర్ల్), మజీద్ అహ్మద్, అహ్మద్ రిజ్వాన్ (వెబ్సైట్ రిపోర్టర్), సయ్యద్ రఫీక్, షేక్ బషీర్, మహ్మద్ ఖలీమ్ ఖాన్, మహ్మద్ సిరాజ్ మెహిదీ, షేక్ సమీరా (హెర్బల్ లైఫ్ వ్యాపారం) అరెస్ట్ కాగా హీనా పరారీలో ఉంది. ఈ సమావేశంలో చిక్కడపల్లి ఏసీపీ యాదగిరి, ముషీరాబాద్ ఇన్స్పెక్టర్ జహంగీర్యాదవ్, డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు.