మెహిదీపట్నం, ఫిబ్రవరి 22: బైక్పై డ్రగ్స్ తరలిస్తున్న ఇద్దరిని గోల్కొండ ఎక్సైజ్ పోలీసులు గురువారం పట్టుకున్నారు. వారి వద్ద నుంచి రూ. 60 వేల విలువజేసే ఎండీఎంఏను స్వాధీనం చేసుకున్నారు. గోల్కొండ ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ శ్రావణి తెలిపిన వివరాల ప్రకారం.. ఆసిఫ్నగర్కు చెందిన ఎన్.జగదీశ్, ముంబై శివాజీనగర్కు చెందిన ఆసిఫ్ షేక్ స్నేహితులు.
లంగర్హౌస్ బాపూనగర్ నుంచి జగదీశ్, ఆసిఫ్ షేక్ కలిసి బైక్పై వెళ్తుండగా ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ సిబ్బంది పట్టుకున్నారు. వారిని తనిఖీ చేయగా.. 5 గ్రాముల ఎండీఎంఏ డ్రగ్స్ లభించింది. వీరిద్దరిని అరెస్ట్ చేసి, రిమాండ్కు తరలించారు.