బంజారాహిల్స్,సెప్టెంబర్ 2: డా.బీఆర్.అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ, అపోలో ఇనిస్టిట్యూట్ ఆఫ్ హెల్త్కేర్ మేనేజ్మెంట్, కృష్ణ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హెల్త్కేర్ సైన్సెస్ సంయుక్త ఆధ్వర్యంలో ఎంబీఏ (హాస్పిటల్ అండ్ హెల్త్కేర్ మేనేజ్మెంట్) ప్రవేశపరీక్ష సెప్టెంబర్ 5న జూబ్లీహిల్స్లోని యూనివర్సిటీ ప్రాంగణంలో నిర్వహిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఉదయం 10.30కి పరీక్ష ప్రారంభమవుతుందని, ఇప్పటికే ఆన్లైన్లో పేర్లను రిజిస్ట్రేషన్ చేసుకున్న అభ్యర్థులతో పాటు స్పాట్ రిజిస్ట్రేషన్ సౌకర్యాన్ని కల్పించినట్లు పేర్కొన్నారు.
ఉదయం 9 గంటలకు యూనివర్సిటీకి వస్తే అక్కడికక్కడే రిజిస్ట్రేషన్ చేసుకుని పరీక్షకు అనుతిస్తామని వెల్లడించారు. అవసరమైన సర్టిఫికెట్లతో పాటు రూ.1500 డీడీ, ఫోటోలు తీసుకుని రావాల్సి ఉంటుందన్నారు.