అంబర్పేట, మార్చి 7 : మహా శివరాత్రికి అంబర్పేట నియోజకవర్గంలోని ఆలయాలు సర్వాంగ సుందరంగా రూపుదిద్దుకున్నాయి. శుక్రవారం మహాశివరాత్రిని పురస్కరించుకొని ఆయా ఆలయాల్లో నిర్వహించనున్న పూజల వివరాలు ఇలా ఉన్నాయి.
*బాగ్అంబర్పేట ఛే నంబర్లోని శ్రీరామ్మందిర్లో శ్రీశివ సీతారామాంజనేయ దేవస్థాన సొసైటీ ఆధ్వర్యంలో మహాశివరాత్రి ఉత్సవాలను నిర్వహిస్తున్నారు.
శుక్రవారం ఉద యం 5 గంటల నుంచి సామూహికంగా ఏకవార రుద్రాభిషేకాలు, విశేష పూజలు నిర్వహిస్తారు. రాత్రి 12 గంటల నుంచి లింగోద్ధవకాల సమయంలో స్వామి వారికి విశేష అభిషేకములు, అర్చనలు, మహా హారతి ఉంటుందని సొసైటి ప్రతినిధులు గణేశ్, రమేశ్, మల్లేశ్, కిరణ్ తదితరులు తెలిపారు.
*నల్లకుంట డివిజన్ తిలక్నగర్ శివాలయం లో శుక్రవారం తెల్లవారు జాము నుంచే ప్రత్యే క అర్చనలు, అభిషేకాలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు.
*శివంరోడ్డు లింగాలగడ్డా శివాలయంలో శుక్రవారం ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు అభిషేకాలు ఉంటాయి. రాత్రి పది గంటలకు దర్శనాలు, రాత్రి 11 గంటలకు శివపార్వతి కల్యాణం నిర్వహిస్తున్నారు. అలాగే పాత రామాలయంలో కూడా మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని భక్తులకు ఏర్పాట్లు చేశారు.
*న్యూనల్లకుంటలోని శ్రీసీతారామాంజనే య సరస్వతి దేవాలయంలో మహాశివరాత్రిని పురస్కరించుకొని ఉదయం 6 నుంచి 12 గంటల వరకు ఏక రుద్రాభిషేకం నిర్వహిస్తున్నారు. రాత్రి శివకల్యాణం ఉంటుంది.
*నల్లకుంటలోని శంకరమఠంలో ఉదయం 6.30కు శక్తిగణపతి, మహాశివుడు, శారదాంబలకు రుద్రాభిషేకాలు, 9 గంటలకు అర్చన, 11 గంటల నుంచి 12 వరకు అమ్మవారి దర్శ నం ఉంటుంది. సాయంత్రం 6 గంటల నుం చి రాత్రి 9 గంటల వరకు అర్చన, 9 నుంచి మహాన్యాస పూర్వక రుద్రాభిషేకము ఉంటుంది.
*శ్రీషిర్డీసాయిబాబా ఆలయంలో ఉదయం 6 గంటలకు కాగడ హారతితో శివరాత్రి కార్యక్రమాలు మొదలవుతాయి. ఉదయం 8 గంటలకు మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం ఉంటుంది.
*అంబర్పేట చెన్నారెడ్డినగర్ శివాలయం, గోల్నాక వీరన్నగుట్ట మహా శివాలయంలో శివరాత్రి ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. బాగ్అంబర్పేట తురాబ్నగర్, మల్లిఖార్జుననగర్లలో కూడా శివరాత్రి ఉత్సవాలను జరపడానికి నిర్వాహకులు ఏర్పాట్లు చేశారు. ఈ సందర్భంగా మార్కెట్లు పూలు, పండ్లతో కలకలలాడుతున్నాయి. ప్రత్యేక పండ్ల విక్రయ కేంద్రాలు వెలిశాయి.