మియాపూర్ : మారుతున్న జీవన శైలి నేపథ్యంలో ప్రతి ఒక్కరూ ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టాలని ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ (MLA Gandhi) అన్నారు. నిత్యం వ్యాయామాన్ని అలవాటు చేసుకోవటంతో పాటు క్రమం తప్పకుండా వైద్య పరీక్షలు(Medical camp) చేయించుకోవాలన్నారు. వివేకానందనగర్ డివిజన్ కమలా ప్రసన్ననగర్లో ఆదివారం నిర్వహించిన ఉచిత వైద్య శిబిరాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైద్యాన్ని వాణిజ్య కోణంలో కాకుండా సేవా రూపంలో చూడాలన్నారు. ప్రైవేటు దవాఖానలు ఉచిత వైద్య సేవల నిర్వహణ ద్వారా ప్రజలలో అవగాహన కల్పిస్తుండటం అభినందనీయమని, ఇలాంటి సేవలను సహచర దవాఖానాలు స్ఫూర్తిగా తీసుకోవాలని సూచించారు. ప్రజల వద్దకే వచ్చి అందిస్తున్న వైద్య సేవలను సద్వినియోగం చేసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ రోజాదేవితో కలిసి రంగారావు , సంజీవరెడ్డి, భాస్కర్రావు, చంద్రకాంత్రావు, చంద్రశేఖర్ , తిరుపతి, శంకర్, బండప్ప, వెంకటేశ్ , డాక్టర్ శ్వేత, చంద్రశేఖర్, సిబ్బంది పాల్గొన్నారు.