MLC Vani Devi | సుల్తాన్ బజార్, జనవరి 25: కళాకారుడి కుంచె నుంచి జాలువారిన ప్రతి చిత్రం సమాజానికి ఓ మంచి సందేశాన్నిస్తున్నదని ఎంఎ ల్సీ సురభి వాణీదేవి అన్నారు. ఈ మేరకు మాసబ్ ట్యాంక్లోని జవహర్లాల్ నెహ్రూ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీ ఆర్ ్టగ్యాలరీలో ‘95 ఇయర్స్ 3 జనరేషన్ ఎగ్జిబిషన్ ఆఫ్ ఫొటోగ్రాఫ్స్, పెయింటింగ్స్ ప్రదర్శనను గురువారం ప్రారంభించారు. ఇందు కు సురభి వాణీదేవి ముఖ్య అతిథిగా విచ్చేసి శ్రీ వెంకటేశ్వర ఆర్ట్స్ కాలేజ్ ప్రిన్సిపాల్, జేఎన్ఏఎఫ్ఏయూ పూర్వ విద్యార్థి సురభి అజిత, హైదరాబాద్ ఆర్ట్ సొసైటీ అధ్యక్షుడు ఎంవీ రమణారెడ్డి, సీనియర్ ఫొటోగ్రాఫర్ సినీ నటు డు విశ్వేందర్రెడ్డి, ప్రముఖ ఆర్టిస్టు, మ్యుజీషియన్ సంజయ్ అష్టాపుత్రే, ఫొటోగ్రఫీ విభా గం హెచ్వోడీ ఏఆర్ కమల్రాయ్, హైదరాబాద్ ఆర్ట్ సొసైటీ సభ్యులు పీవీ జ్ఞానేశ్వర్ రావులతో కలిసి ప్రారంభించారు.
అనంతరం ముఖ్య అతిథులుగా విచ్చేసిన ప్రముఖులు ప్రదర్శనను ఆసక్తిగా తిలకించారు. తదనంతరం వర్సిటీ ఆడిటోరియంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆమె పీ వీరయ్య, పీవీ రావు ల బయోపిక్తో రచించిన పుస్తకాన్ని ఆమె ఆవిష్కరించారు. అనంతరం ఆమె మాట్లాడు తూ లలిత కళల పట్ల ఎంతో గౌరవం ఉందన్నారు. రెండు కళలను ఒకేసారి నేర్చుకోవడం సాధ్యం కాని పని అని అన్నారు. పీ జ్ఞానేశ్వర్రావు తన తండ్రి బాటలో నడవడమే కాకుం డా తన ఇద్దరు కుమారులను అదే బాటలో తీసుకువెళ్ళి మంచి స్థానంలో నిలపడం అభినందనీయమని అన్నారు. కార్యక్రమంలో పీ విక్రమ్, వివేక్, డాక్టర్ శివకుమార్, రచయిత డీ లక్ష్మీతో పాటు పీవీ జ్ఞానేశ్వర్ రావు కుటుం బ సభ్యులు, ఆర్టిస్టులు, ఫొటోగ్రాఫర్లు పెద్ద ఎత్తున్న పాల్గొన్నారు. ఆర్ట్ గ్యాలరీలో పీవీ రావు 3తరాలుగా చిత్రీకరించిన పెయింటిం గ్స్, ఫొటోగ్రఫీలు ఆకట్టుకున్నాయి.