హైదరాబాద్ : ఇటీవల మెడికల్ ఇన్ఫ్రా స్ట్రక్చర్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా నియమితులైన ఎర్రోళ్ల శ్రీనివాస్ పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ను వెస్ట్ మారేడ్పల్లిలోని తన నివాసంలో మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాస్ యాదవ్ ఎర్రోళ్ల శ్రీనివాస్కు శుభాకాంక్షలు తెలిపారు. జీవితంలో మరిన్ని ఉన్నత పదవులు చేపట్టాలని ఆకాంక్షించారు.