సిటీబ్యూరో, జనవరి 26 (నమస్తే తెలంగాణ): ప్రజలకు సేవలు అందించడంలో ప్రభుత్వ ఉద్యోగులు నిబద్ధతతో వ్యవహరించాలని జిల్లా అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు అన్నారు. గురువారం హైదరాబాద్ కలెక్టరేట్లో ఆయన జాతీయ జెండాను ఎగురవేశారు. అనంతరం మాట్లాడుతూ హైదరాబాద్ను అన్ని విధాలుగా ఉత్తమ జిల్లాగా తీర్చిదిద్దడానికి అందరూ పునరంకితులు కావాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి సూర్యలత, ఎస్ఎల్డీసీ ఎల్పీ సంతోషి, జిల్లా అధికారులు, కలెక్టరేట్, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
వైద్య, ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో..
సిటీబ్యూరో, జనవరి 26 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్ జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ కార్యాలయంలో జిల్లా వైద్యాధికారి డాక్టర్ జె.వెంకటి, రంగారెడ్డి జిల్లా కార్యాలయంలో జిల్లా వైద్యాధికారి డాక్టర్ వెంకటేశ్వర్లు, మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా కార్యాలయంలో జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ పుట్ల శ్రీనివాస్లు జాతీయ పతాకాలను ఆవిష్కరించారు. కోఠిలోని డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ ప్రధాన కార్యాలయంలో డీఎంఈ డాక్టర్ రమేశ్ రెడ్డి, వైద్యవిధాన పరిషత్ కార్యాలయంలో వీవీపీ కమిషనర్ అజయ్కుమార్ జాతీయ పతాకాలను ఆవిష్కరించారు. గాంధీ దవాఖానలో సూపరింటెండెంట్ డాక్టర్ రాజారావు, నిమ్స్లో డైరెక్టర్ డాక్టర్ బీరప్పా జాతీయ జెండాను ఎగురవేశారు.