బంజారాహిల్స్, అక్టోబర్ 29: జూబ్లీహిల్స్లోని టీటీడీ వెంకటేశ్వరస్వామి ఆలయం లోకల్ అడ్వయిజరీ కమిటీ అధ్యక్షుడిగా ఎలిశాల రవిప్రసాద్ బాధ్యతలు స్వీకరించారు. ఆదివారం ఆలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్రెడ్డి, రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ చేతుల మీదుగా నియామక పత్రాన్ని రవిప్రసాద్కు అందజేశారు.
అనంతరం వేద పండితులు ఆశీర్వచనం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ డీజీపీ మహేందర్రెడ్డి, టీటీడీ బోర్డు సభ్యురాలు గడ్డం సీతారెడ్డి, నాగసత్యం, సుబ్బరాజు. హిమాయత్నగర్ టీటీడీ ఎల్ఏసీ అధ్యక్షుడు ప్రసాద్, ఐఏఎస్ అధికారులు అమయ్కుమార్, హరీశ్, నాయక్, రమణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.