ఎందుకు ఓటింగ్ శాతం తగ్గుతున్నది. ఓట్లు వేయడానికి నగర ప్రజలు ఆసక్తి చూపక పోవడానికి కారణం ఏంటి. ఏడాదికి ఏడాది ఓటింగ్ శాతం పెరగాలి..కాని ఇక్కడ ఏడాదికి ఏడాది ఓటింగ్ శాతం తగ్గుతూ వస్తుంది. ఓ పక్క ప్రజాస్వామ్య బద్ధంగా కచ్చితంగా ఓటు హక్కును వినియోగించుకోవాలని రాజకీయ నాయకులు, అధికారులు మాధ్యమాలతో పాటు వివిధ రూపాల్లో ప్రచారం చేస్తున్నప్పటికీ నగర ఓటర్లు మాత్రం బద్ద్దకిస్తున్నారు. ఓటింగ్ రోజున వేతనంతో కూడుకున్న సెలవు ఇచ్చినా..ముందుకు రావడం లేదు. వందకు వందశాతం ఓటింగ్ ఎప్పుడు జరుగునో వేచి చూడాల్సిందే..!
బేగంపేట్ డిసెంబర్ 1: సనత్నగర్ నియోజకవర్గంలో అంతంత మాత్రంగానే పోలింగ్ నమోదు అయినట్టు ఎన్నికల రిటర్నింగ్ అధికారి కిషన్రావు తెలిపారు. 2018లో జరిగిన ఎన్నికలతో పోల్చుకుంటే ఈ సారి అంతకాకుండా పోలింగ్ శాతం మరింత తగ్గిందన్నారు. 2018లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో 52.29 శాతం నమోదు కాగా 2023లో జరిగిన ఎన్నికల్లో 51.96 శాతం మాత్రమే నమోదు అయిందన్నారు. తొలి రెండు గంటల్లో తెలంగాణ రాష్ట్రంలోనే అత్యల్పంగా సనత్నగర్లో నియోజకవర్గంలో కేవలం 1.02 శాతం మాత్రమే నమోదు అవ్వగా మెల్లమెల్లగా పుంజుకోని సాయంత్రం 5 గంటలకు 50.74 శాతం నమోదు అయింది.
అనంతరం సనత్నగర్ డివిజన్లోని అల్లావుద్ధీన్కోఠి బస్తీలోని కమ్యూనిటీహాల్లో ఏర్పాటు చేసిన 223వ నెంబర్ పోలింగ్ బూత్లో సుమారు వంద మంది, అలాగే ఎస్సార్నగర్ నారాయణ కళాశాలలో ఏర్పాటు చేసిన 189వ బూత్లో సుమారు 150 మంది బారులు తీరి ఉండటం.. దీనికి తోడు కొంత వరకు ఈవీఎంలు మొరాయించడంతో 2 గంటల వరకు పోలింగ్ ఆలస్యం అయింది. దీంతో 5 గంటల తర్వాత మరికొంత పోలింగ్ శాతం పెరిగి చివరకు 51.96 శాతంగా నమోదు అయింది. గతంతో పోల్చుకుంటే 1శాతంకు పైగా తగ్గిందని అధికారులు పేర్కొన్నారు. ఓటింగ్ శాతం మరింత పెంచడానికి చర్యలు తీసుకున్నప్పటిjw ఓటర్లు మాత్రం ఆసక్తి చూపక పోవడంతో క్రితం కంటే తక్కుగానే పోలింగ్ శాతం నమోదు అయినట్లు అధికారులు వెల్లడించారు.