సిటీబ్యూరో, అక్టోబర్ 19 (నమస్తే తెలంగాణ) : ఎన్నికల ప్రవర్తనా నియమావళిలో భాగంగా జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు బ్యాంకుల్లో లెకకు మించిన నగదు అకౌంట్ల సమాచారాన్ని ఎన్నికల నోడల్ ఆఫీసర్ అకౌంటింగ్కు రోజు వారీగా రిపోర్ట్ ద్వారా అందించాలని జిల్లా ఎన్నికల అధికారి రొనాల్డ్ రాస్ తెలిపారు. గురువారం జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయం పన్వర్ హాల్లో హైదరాబాద్ జిల్లాలోని అన్ని బ్యాంకు మేనేజర్లతో ఎన్నికల అధికారి రోనాల్డ్రోస్ సమావేశం నిర్వహించారు.
ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున బ్యాంకులలో జరిగే డిజిటల్ లావాదేవీలలో అనుమానిత, లెకకు మించిన నగదు అకౌంట్లపై నిఘా ఉంచి వాటి సమాచారాన్ని ప్రతి రోజు ఉదయం 10 గంటలలోపు జిల్లా ఎన్నికల అధికారికి పంపించాలని రోనాల్డ్రోస్ తెలిపారు. ఏటీఎంలలో నగదు డిపాజిట్ చేయడానికి వినియోగించే వాహనాలకు తప్పనిసరిగా జీపీఎస్ను ఏర్పాటు చేసి వాహనాలను పరిశీలించాలని తెలిపారు. ఎన్నికల ప్రవర్తన నియమావళిని అనుసరించి ప్రతి వాహనాన్ని తనిఖీ చేయడం జరుగుతుందని, తరలిస్తున్న నగదుకు తప్పనిసరిగా డాక్యుమెంట్లు, క్యూఆర్ కోడ్ ఉండేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. ప్రతి ఒకరూ నగదుకు సంబంధించి రిసిప్ట్లను తప్పనిసరిగా కలిగి ఉండాలని రోనాల్డ్రోస్ సూచించారు.
నగరంలో పట్టుబడుతున్న నగదును పరిశీలించి ఎటువంటి సమస్య లేనప్పుడు వాటిని వేగవంతంగా రిలీజ్ చేస్తున్నామని జిల్లా ఎన్నికల ఉప అధికారి అనుదీప్ దురిశెట్టి తెలిపారు. నవంబర్ 13 నుంచి 30 వరకు పోటీలో పాల్గొనే రాజకీయ పార్టీల అభ్యర్థుల అకౌంట్ నంబర్లను సంబంధిత బ్యాంకులకు అందించడం ద్వారా వారి లావాదేవీలను ఎప్పటికప్పుడు నమోదు చేయాలని తెలిపారు. ఈ సమావేశంలో నోడల్ ఆఫీసర్ శరత్ చంద్ర, అడిషనల్ కమిషనర్ ఎలక్షన్ శంకరయ్య, ఐటీ అధికారులు మనీశా, ఆర్బీఐ మేనేజర్, హైదరాబాద్ జిల్లాలోని అన్ని బ్యాంకుల మేనేజర్లు పాల్గొన్నారు.
సిటీబ్యూరో, అక్టోబర్ 19(నమస్తే తెలంగాణ) : ఓటరు ఐడీ కార్డు ఉన్నంత మాత్రాన మీ ఓటు చెల్లదని, తుది ఓటరు జాబితాలో మీ పేరును రీ -చెక్ చేసుకోవాలని జిల్లా ఎన్నికల అధికారి, జీహెచ్ఎంసీ కమిషనర్ రొనాల్డ్ రాస్ పేర్కొన్నారు. గురువారం హైకోర్టులో స్వీప్ యాక్టివిటీ కింద ఏర్పాటు చేసిన రీ-చెక్ యువర్ ఓట్ కౌంటర్ను డిప్యూటీ డీఈవో అనుదీప్ దురిశెట్టితో కలిసి రోనాల్డ్రోస్ పరిశీలించారు. ఈ సందర్భంగా రిజిస్టర్ ప్రొటోకాల్ శ్రీధర్ రావు, హైకోర్టు జడ్జిలు, న్యాయవాదులు, సిబ్బందితో మాట్లాడి ఓటరు జాబితాలో తమ పేరును ఎలా చెక్ చేసుకోవాలో అవగాహన కల్పించారు. VOTER.ECI. GOV.INలో ఓటరు జాబితాలో మీ పేరును చెక్ చేసుకోవచ్చన్నారు. ఇతర సందేహాలకు టోల్ ఫ్రీ నంబరు 1950ను సంప్రదించాలని ఎన్నికల అధికారి తెలిపారు. ఈ కార్యక్రమంలో చార్మినార్ జోనల్ కమిషనర్ వెంకన్న, స్వీప్ నోడల్ ఆఫీసర్ అబ్దుల్ వకీల్, డిప్యూటీ కమిషనర్ డాకు నాయక్, జాయింట్ కమిషనర్ మంగతాయారు తదితరులు పాల్గొన్నారు.