మెహిదీపట్నం, మే 7: తెలంగాణ రాష్ట్ర మెడికల్ కౌన్సిల్ నూతన అధ్యక్షుడిగా మెహిదీపట్నం సరోజినీదేవి కంటి దవాఖాన సూపరింటెండెంట్ డాక్టర్ రాజలింగం ఎన్నికయ్యారు. మెడికల్ కౌన్సిల్ను శనివారం ఏర్పాటు చేసింది. ఇందులో సభ్యులుగా సరోజినీదేవి కంటి ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రాజలింగం, ఉస్మానియా దవాఖాన ప్రొఫెసర్ డాక్టర్ వి.రమేశ్, సిద్దిపేటకు చెందిన డాక్టర్ డి.చంద్రారెడ్డి, కరీంనగర్కు చెందిన డాక్టర్ సీహెచ్ అమిత్ కుమార్, నగరానికి చెందిన డాక్టర్ కృష్ణారెడ్డి, జడ్చర్లకు చెందిన డాక్టర్ ఎస్.కె.అగర్వాల్ నియమితులయ్యారు. వీరు కౌన్సిల్ అధ్యక్షుడిగా డాక్టర్ రాజలింగంను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఉపాధ్యక్షుడిగా డాక్టర్ చంద్రారెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. రిజిస్ట్రార్ డాక్టర్ సీహెచ్ హన్మంతారావు ఎన్నికల ప్రక్రియను నిర్వహించారు. కార్యక్రమంలో వైస్ చాన్స్లర్ డాక్టర్ కరుణాకర్రెడ్డి, డీఎంఈ డాక్టర్ రమేశ్రెడ్డి, కమిషనర్ డాక్టర్ అజయ్ కుమార్, హెల్త్ డైరెక్టర్ డాక్టర్ శ్రీనివాస్ పాల్గొన్నారు.