మారేడ్పల్లి : మోండా మార్కెట్ డివిజన్ కుమ్మరిగూడలో డైనేజీ సమస్య తలెత్తకుండా చర్యలు తీసుకుంటున్నామని కంటోన్మెంట్ ఎమ్మెల్యే జి. సాయన్న అన్నారు. గురువారం డివిజన్ పరిధిలోని కుమ్మరిగూడలో 35 లక్షల రూపాయల వ్యయంతో చేపట్టనున్న డైనేజీ పైప్లైన్ నిర్మాణ పనులకు ఎమ్మెల్యే జి. సాయన్న శంఖుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…బస్తీ, కాలనీల్లో డైనేజీ సమస్య తలెత్తకుండా చర్యలు తీసుకుంటున్నామని, అవ సరం ఉన్న ప్రాంతాల్లో నిధులను వెచ్చించి పైప్లైన్ను వేస్తున్నామని తెలిపారు. కుమ్మరిగూడలో డైనేజీ సమస్య ఉందని గతంలో తమ దృష్టికి తీసుకొచ్చారని, వెంటనే నిధులు మంజూరు చేసి సమస్య పరిష్కరానికి కృషి చేశానని తెలిపారు.
ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ కొంతం దీపిక, జీహెచ్ఎంసీ మాజీ కో ఆప్షన్ సభ్యుడు సిఎన్. నర్సింహ్మముదిరాజ్, బోయిన్పల్లి మార్కెట్ కమిటీ చైర్మన్ టిఎన్. శ్రీనివాస్, మోండా డివిజన్ అధ్యక్షులు ఆకుల హరికృష్ణ, టీఆర్ఎస్ నాయకులు పిట్ల నాగేష్, ముప్పిడి మధుకర్, సదానంద్గౌడ్, జలమండలి జీఎం రమణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.