శేరిలింగంపల్లి : మసీదుబండ ప్రభుపాధ లేఅవుట్ కాలనీలో నెలకొన్న సమస్యల శాశ్వత పరిష్కారానికి కృషి చేస్తానని ప్రభుత్వ విప్, శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ అన్నారు. సోమవారం నియోజకవర్గంలోని మసీదుబండా ప్రభుపాద లేఅవుట్ కాలనీలో స్థానికుల విజ్ఞప్తి మేరకు ఆయన వివిద శాఖల అధికారులతో కలిసి పర్యటించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ కాలనీలో నెలకొన్న డ్రైనేజీ ఔట్లెట్ సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటానన్నారు. మురుగు నీటి సమస్యకు శాశ్వత పరిష్కారం దిశగా కృషిచేస్తాన్నారు. ఔట్లెట్ లేకపోవడంతో కాలనీలో డ్రైనేజీ పొంగిపొర్లుతుందని అన్నారు. త్వరలోనే ఔట్లెట్ సమస్యను పరిష్కరించి ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చేస్తానని పేర్కొన్నారు.
ప్రజల ఎదుర్కొంటున్న సమస్యలు క్షేత్రస్ధాయిలో పర్యటించి వాటిని తెలుసుకొని పరిష్కరించేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. నియోజకవర్గంలో ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటు ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రధమ ప్రాదాన్యతను ఇవ్వడం జరుగు తుందని అన్నారు. ముఖ్యంగా మౌళిక వసతుల కల్పనకు అధిక ప్రాదాన్యతను ఇస్తున్నట్లు చెప్పారు.
మంచినీరు. రహాదారులు, విద్యుత్, డ్రైనేజీ లాంటి సమస్యలు లేకుండా చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జలమండలి మేనేజర్ సందీప్, కాలనీ సంక్షేమ సంఘం ప్రతినిదులు సుదాకర్, వేణు, రామేశ్వరరావు, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.