ముషీరాబాద్/కవాడిగూడ, డిసెంబర్ 24: క్రిస్మస్ పర్వదినాన్ని పురస్కరించుకొని శనివారం రాంనగర్లో పేదలకు క్రిస్మస్ కానుకల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే ముఠా గోపాల్ ముఖ్య అతిథిగా పాల్గొని పేదలకు క్రిస్మస్ కానుకలు పంపిణీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ క్రైస్తవులకు అన్ని సంక్షేమ పథకాలను ప్రభుత్వం వర్తింపచేస్తూ అభివృద్ధి పథంలోకి తీసుకురావడానికి కేసీఆర్ ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ యూత్ విభాగం నేత ముఠా జయసింహ, రాంనగర్ డివిజన్ అధ్యక్షుడు రావులపాటి మోజస్ తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా రాంనగర్ టీఆర్టీ క్వార్టర్స్లో రాత్రి క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుల్లో బీఆర్ఎస్ పార్టీ గ్రేటర్ నేత ఎంఎన్ శ్రీనివాసరావు ముఖ్య అతిథిగా పాల్గొని క్రిస్మస్ కేక్ కట్ చేసి శుక్షాకాంక్షలు తెలిపారు. తగరం అనిల్కుమార్, నేత శ్రీనివాస్ పాల్గొన్నారు.
దేవాలయం అభివృద్ధికి కృషి చేయాలి..
దేవాలయం అభివృద్ధికి ధర్మకర్తల మండలి సభ్యులు కృషి చేయాలని ఎమ్మెల్యే ముఠా గోపాల్ అన్నారు. ఈ మేరకు శనివారం కవాడిగూడ డివిజన్ దోమలగూడలోని శ్రీ హనుమాన్ టెంపుల్లో ఆల య కమిటీ ధర్మకర్తల మండలి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమానికి ఎమ్మెల్యే హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ గొల్లగడ్డ రాజశేఖర్గౌడ్, బీఆర్ఎస్ నాయకుడు ముఠా జయసింహ, కవాడిగూడ డివిజన్ అధ్యక్ష, కార్యదర్శులు వల్లాల శ్యామ్ యాదవ్, ఎన్డీ సాయికృష్ణ, ఆలయ ధర్మకర్తల మండలి సభ్యులు వి. సంతో ష్, జి. వేణుగోపాల్, టి. శేఖర్, ఎస్. లావణ్య, నాయకులు రాంచందర్, దొబ్బు శ్రీను, శ్రీకాంత్, శివ తదితరులు పాల్గొన్నారు.
న్యూట్రీషియన్ కిట్లు అందజేయడం అభినందనీయం..
టీబీ రోగులకు రేషన్తో పాటు న్యూట్రీషియన్ కిట్లను అందజేయడం అభినందనీయమని ఎమ్మెల్యే ముఠా గోపాల్ అన్నారు. ఈ మేరకు శనివారం కవాడిగూడలోని రవి హీలియోస్ దవాఖానలో రెడ్క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో టీబీ రోగులకు నిత్యావసర సరుకులతో పాటు న్యూట్రీషియన్ కిట్లను రెడ్క్రాస్ సొసైటీ చైర్మన్ భీమ్రెడ్డి, సొసైటీ కన్వీనర్, రవి హీలియోస్ దవాఖాన డాక్టర్ విజయభాస్కర్, డాక్టర్ వెంకటిలతో కలిసి ఆయన అందజేశారు. డాక్టర్ శ్రీదేవి, బ్రహ్మకుమారీస్ జయశ్రీ, రామ్మోహన్గౌడ్, వినయ్, రియాజ్, కళావతి, బీఆర్ఎస్ కవాడిగూడ డివిజన్ అధ్యక్ష, కార్యదర్శులు వల్లాల శ్యామ్ యాదవ్, ఎన్డీ సాయికృష్ణ, దోమలగూడ శ్రీ హనుమాన్ టెంపుల్ చైర్మన్ గొల్లగడ్డ రాజశేఖర్ గౌడ్, కల్వ గోపి, రాంచందర్, శ్రీకాంత్ పాల్గొన్నారు.