మారేడ్పల్లి, జనవరి 21 : ప్రజా సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తున్నామని కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్న అన్నారు. శనివారం మోండా డివిజన్ రెజిమెంటల్బజార్లో సెబాస్టియన్ రోడ్డులో రూ. 34 లక్షలతో బీటీ రోడ్డు , జూలమ్మ బస్తీలో రూ.16 లక్షలు, సలూజా నర్సింగ్ హోం రోడ్డులో రూ.23 లక్షలతో వ్యయంతో డ్రైనేజీ పైప్లైన్ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సాయన్న మాట్లాడుతూ… స్థానికంగా నెలకొన్న సమస్యలను ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ వాటి పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. మోండా డివిజన్లో కోట్ల రూపాయాల నిధులు వెచ్చించి మౌలిక సదుపాయాలను కల్పించినట్లు తెలిపారు.
సీసీ, బీటీ రోడ్ల ఏర్పాటు, డ్రైనేజీ, పార్కుల అభివృద్ధి, తాగునీటి పైప్లైన్ల నిర్మాణం తదితర అభివృద్ధి పనులు చేపట్టినట్లు తెలిపారు. రెజిమెంటల్బజార్లో రూ. 73 లక్షల వ్యయ ంతో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశామని త్వరలో పనులు ప్రారంభించాలని అధికారులకు సూచించినట్లు తెలిపారు. కార్పొరేటర్ కొంతం దీపిక, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.