మియాపూర్ : నియోజకవర్గ సమగ్రాభివృద్ధికి అనునిత్యం కృషి చేస్తున్నట్లు, ఇందుకోసం తగు నిధులను ఎప్పటికపుడు మంజూరు చేయించుకుంటూ ప్రణాళికా బద్ధంగా ముందుకు సాగుతున్నట్లు విప్ ఆరెకపూడి గాంధీ పేర్కొన్నారు.
శేరిలింగంపల్లి నియోజకవర్గం వివేకానందనగర్ డివిజన్ పరిధిలో రూ. 1.45 కోట్లతో చేపట్టనున్న బీటీ, సీసీ రోడ్ల నిర్మాణ పనులకు కార్పొరేటర్ మాధవరం రోజాదేవితో, కూకట్పల్లి డివిజన్ బాలకృష్ణనగర్లో రూ. 10 లక్షలతో చేపట్టనున్న యూజీడీ నిర్మాణ పనులకు కార్పొరేటర్ జూపల్లి సత్యనారాయణలతో కలిసి విప్ ఆరెకపూడి గాంధీ సోమవారం శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా ఆయా డివిజన్లలో ఆయన మాట్లాడుతూ నియోజకవర్గంలోని ప్రతి డివిజన్లో యూజీడీ, రహదారులు, తాగునీరు, విద్యుత్ వంటి మౌలిక వసతులను పూర్తి స్థాయిలో కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు. కాలనీల్లో చేపట్టాల్సిన పనులపై ఎప్పటికపుడు క్షేత్రస్థాయిలో ప్రజల నుంచి తెలుసుకుంటూ అందుకు అనుగుణంగా సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ల తోడ్పాటుతో నిధులను సమీకరించుకుంటూ పనులను చేపడుతున్నట్లు గాంధీ పేర్కొన్నారు.
ప్రజల సౌకర్యం కోసం కోట్లు వెచ్చించి చేపడుతున్న నిర్మాణ పనులలో నాణ్యతను పాటించాలని, సకాలంలో పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలన్నారు. అన్ని కాలనీల్లో సౌకర్యవంతమైన రహదారులను నిర్మించేందుకు అధిక ప్రాధాన్యతతో ముందుకు సాగుతున్నామని విప్ గాంధీ తెలిపారు.
ఈ కార్యక్రమంలో డీజీఎం వెంకటేశ్వర్లు, మేనేజర్ న్సి, మాజీ కార్పొరేటర్ రంగారావు, పార్టీ నేతలు సంజీవరెడ్డి, లక్ష్మీనారాయణ,శ్రీనివాస్,వడ్డేపల్లి రాజేశ్వర్రావు, మోజెస్,భద్రయ్య, ఆంజనేయులు,హరినాథ్, బాబూరావు, రాంచందర్రావు, విజయ్, ప్రసాద్ , కాలనీ అసోసియేషన్ ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.