సైఫాబాద్ సైన్స్ కళాశాలలో పూర్వ విద్యార్థుల సమ్మేళనంలో పాల్గొన్న ప్రముఖులు
సుల్తాన్బజార్, మార్చి 26: సైఫాబాద్ సైన్స్ కళాశాలలో శనివారం కళాశాల పూర్వ విద్యార్థులు సందడి చేశారు. తెలంగాణ ఏర్పడిన అనంతరమే ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు నేతృత్వంలో విద్యారంగానికి పెద్దపీట వేశారని కార్యక్రమానికి విచ్చేసిన రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ ఆర్.లింబాద్రి అన్నారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఆయన ఓయూ వీసీ ప్రొఫెసర్ డి.రవీందర్, రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ లక్ష్మణ్, శాస్త్రవేత్త అభిజిత్ ముఖర్జీ, కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ జే లక్ష్మణ్ నాయక్ కళాశాల అలుమ్ని అసోసియేషన్ అధ్యక్షుడు అశోక్ కుమార్లతో కలిసి కళాశాల ఆవరణలో అలుమ్ని కార్యాలయాన్ని ప్రారంభించారు. ఓయూ వీసీ ప్రొఫెసర్ రవీందర్ మాట్లాడుతూ.. కళాశాలలో విద్యను అభ్యసించి ఉన్నత రంగాలలో స్థిర పడిన పూర్వ విద్యార్థులు కళాశాల అభ్యున్నతికి పాటు పడటం అభినందనీయమన్నా రు. అలుమ్ని వెబ్సైట్ను ప్రారంభించడం శుభసూచకమన్నారు. రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ లక్ష్మణ్ మాట్లాడుతూ.. కళాశాలలో చదువుకున్న సమయాన్ని గుర్తు చేసుకున్నారు.
ఆ సమయంలో ఇన్ని వసతులు లేవు..
సైఫాబాద్ సైన్స్ కళాశాలలో తాము చదివే సమయంలో ఇన్ని వసతులు లేవన్నారు. కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు జస్టిస్ కె.సురేందర్, ఖమ్మం ఎమ్మెల్యే కె.ఉపేందర్రెడ్డి, ఎంఎల్సీ కె.జనార్దన్రెడ్డి, ఉన్నత విద్యామండలి సెక్రటరీ ఎం.మల్లారెడ్డి, సైఫాబాద్ డీసీపీ ఏ ముత్యంరెడ్డి, నారాయణపేట్ అడిషనల్ కలెక్టర్ చంద్రారెడ్డి, తెలంగాణ ఎక్సైజ్ జాయింట్ కమిషనర్ ఖురేషీ, బీఎస్ఎన్ఎల్ డీజీఎం డి.పి.రాజ్కుమార్,డీజీఎం బి.విష్ణుమూర్తి, జాయింట్ కమిషనర్ కె.కోటేశ్వర్రావు, ఎల్ఐసీ రీజినల్ మేనేజర్ ఎస్.వెంకటేశ్వర్ రావు, మైన్స్ అసిస్టెంట్ డైరెక్టర్ సీహెచ్ వెంకటేశ్వర్లు,సంగారెడ్డి రెవెన్యూ అధికారి జి.నాగేశ్,డీఎం అండ్ హెచ్వో కొండల్ రావు, కళాశాల పూర్వ విద్యార్థుల గవర్నింగ్ బాడీ అధ్యక్షుడు అశోక్కుమార్, ప్రధాన కార్యదర్శి అమ్జద్ అలీ, కోశాధికారి డాక్టర్ అభిజిత్ ముఖర్జీ, కళాశాల వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ లక్ష్మీ భవా ని,డాక్టర్ జగదీశ్వర్, ఎన్సీసీ అధికారి డాక్టర్ పల్లాటి నరేశ్, బోధన, బోధనేతర సిబ్బంది, 200 మంది పూర్వ విద్యార్థులు పాల్గొన్నారు.