బడంగ్పేట/ఆర్కేపురం, మార్చి 31 : కల్యాణలక్ష్మి పథకం దేశానికే ఆదర్శమని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. బడంగ్పేట మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో 75 మందికి కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులను శుక్రవారం అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. రాష్ట్ర వ్యాప్తంగా 13 లక్షల మందికి కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులను అందజేయడం జరిగిందన్నారు. మహేశ్వరం నియోజకవర్గంలో 14 వేల మందికి కల్యాణలక్ష్మి, షాదీముబార్ చెక్కులను అందజేశామన్నారు. మహిళల ఆత్మగౌరవానికి సీఎం కేసీఆర్ పెద్దపీట వేస్తున్నారని పేర్కొన్నారు. కల్యాణలక్ష్మి పథకంతో బాల్య వివాహాలు తగ్గాయని చెప్పారు. 18 ఏండ్లు నిండన వారికి మాత్రమే కల్యాణలక్ష్మి పథకం వర్తిస్తుందని చెప్పడంతో వయస్సు వచ్చిన తర్వాతనే వివాహాలు చేస్తున్నారని గుర్తు చేశారు. దీంతో అమ్మాయిలు పై చదువులపై దృష్టి పెట్టడం జరిగిందన్నారు. యూనివర్సిటీల్లో 70శాతం యువతులు చదువుకుంటున్నారన్నారు. అక్షరాస్యత శాతం పెరిగిందన్నారు. గతంలో ఆడబిడ్డ పుడితే పెండ్లీలు ఎలా చేయాలని తల్లిదండ్రులు ఎంతో బాధపడే వారని.. ఇప్పుడు ఆ పరిస్థితి లేదన్నారు. ఆడబిడ్డ పుడితే కల్యాణలక్ష్మి అందజేసి ముఖ్యమంత్రి కేసీఆర్ మేన మామగా ఆదుకుంటున్నారని అన్నారు. ఆడబిడ్డ పుడితే పదమూడు వేలు, మగబిడ్డ పుడితే పన్నెండు వేలు ఇవ్వడం జరుగుతుందన్నారు. కేసీఆర్ కిట్టు ద్వారా పిల్లలకు అవసరమైన అన్ని వస్తువులు ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. గృహలక్ష్మి పథకం ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. సొంత స్థలం ఉన్న ప్రతి ఒక్కరికీ గృహలక్ష్మి పథకం వస్తుందన్నారు. దేశంలో ఎక్కడా ఇలాంటి పథకాలు లేవన్నారు. మహిళల భదత్ర కోసం షీటీమ్లను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో సూరజ్ కుమార్, మేయర్ చిగిరింత పారిజాత నర్సింహారెడ్డి, తాసీల్దార్ జనార్దన్, డిప్యూటీ మేయర్ ఇబ్రాం శేఖర్, కమిషనర్ కృష్ణ మోహన్ రెడ్డి, కార్పొరేటర్లు, అధికారులు తదితరులు ఉన్నారు.
ప్రజా సంక్షేమంలో తెలంగాణ రాష్ట్రం ముందంజలో ఉందని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి అన్నారు. శుక్రవారం సరూర్నగర్ తాసీల్దార్ కార్యాలయంలో సరూర్నగర్, ఆర్కేపురం డివిజన్లకు చెందిన 62 మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. పేదింటి ఆడబిడ్డల పెండ్లిలకు ఇబ్బందులు లేకుండా సీఎం కేసీఆర్ కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాల ద్వారా అండగా నిలుస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ బొగ్గారపు దయానంద్, కార్పొరేటర్ రాధాధీరజ్రెడ్డి, కందుకూర్ ఆర్డీవో సూరజ్, తాసీల్దార్ జయశ్రీ, బీఆర్ఎస్ మహేశ్వరం నియోజకవర్గం ప్రధాన కార్యదర్శిలు బేర బాలకిషన్, మురుకుంట్ల అరవింద్, గడ్డిఅన్నారం మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ రామ్నర్సింహ గౌడ్, మాజీ కార్పొరేటర్ పారుపల్లి అనితాదయాకర్రెడ్డి, మాజీ అధ్యక్షుడు ఇంటూరి అంకిరెడ్డి, రాజేశ్ గౌడ్, న్యాలకొండ శ్రీనివాస్రెడ్డి, కంచర్ల శేఖర్, జగన్మోహన్రెడ్డి, లోడి నర్సింహ గౌడ్, సాజీద్, సుదర్శన్, రాఘవేంద్ర గుప్తా, ఎండీ సలీం, రాజు తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణ రాష్ట్రంలోనే కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కుల పంపిణీలో బాలాపూర్ మండలం మొదటి స్థానంలో ఉందని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. మీర్పేట మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో శుక్రవారం సాయంత్రం లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. బాలాపూర్ మండల పరిధిలో ఇప్పటి వరకు 6,488 మందికి కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులను అందజేశామన్నారు. చెక్కుల పంపిణీలో బాలాపూర్ మండలం మొదటి స్థానంలో ఉందన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ మనసున్న మహారాజు అని మంత్రి కొనియాడారు. తెలంగాణ రాష్ట్రంలో అమలవుతున్న కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్, రైతుబంధు, రైతు బీమా వంటి పథకాలు దేశంలో ఎక్కడా ఇవ్వడంలేదని పేర్కొన్నారు. మహిళల ఆత్మగౌరవానికి ముఖ్యమంత్రి పెద్దపీట వేస్తున్నారని అన్నారు. మహిళలు పడుతున్న కష్టాలను చూసిన తర్వాత ముఖ్యమంత్రి మహిళల కోసం అనేక పథకాలు ప్రవేశపెట్టడం జరిగిందని అన్నారు. మహిళల రక్షణ కోసం షీ టీమ్లను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ తీగల విక్రంరెడ్డి, ఆర్డీవో సూరత్ కుమార్, తాసీల్దార్ జనార్దన్, కమిషనర్ సీహెచ్ నాగేశ్, డీఈ గోపీనాథ్, బీఆర్ఎస్ అధ్యక్షుడు అర్కల కామేశ్రెడ్డి, కార్పొరేటర్లు, తదితరులు పాల్గొన్నారు..