బడంగ్పేట, ఫిబ్రవరి 5 : చెరువులు, కుంటలు, పార్కుల అభివృద్ధికి ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్ విజన్తో ముందుకు వెళ్తున్నారని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. బడంగ్పేట మున్సిపాలిటీ పరిధిలోని బట్టోనిగుట్ట వద్ద పార్కును ప్రారంభించారు. నాదర్గూల్లో రూ.1.50కోట్లతో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు. అనంతరం గాంధీనగర్లో ఆంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్ఠాపనకు హాజరై దేవాలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. పటేల్గుట్ట చారిత్రాత్మక గుట్ట అన్నారు. భవిష్యత్లో పార్కును కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రజలందరిపై ఉందన్నారు.
సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ మున్సిపాలిటీల అభివృద్ధి కోసం ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళ్తున్నారన్నారు. ఇంటి గ్రేటెడ్ మార్కెట్లు, చెరువులు సుందరీకరణ పనులు చేపడుతున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో మేయర్ చిగిరింత పారిజాత నర్సింహారెడ్డి, డిప్యూటీ మేయర్ ఇబ్రాం శేఖర్, కార్పొరేటర్లు బోయపల్లి దీపికాశేఖర్రెడ్డి, పెద్దబావి శోభాఆనంద్రెడ్డి, భీముడి స్వప్నాజంగారెడ్డి, సంరెడ్డి స్వప్నావెంకట్రెడ్డి, ముత్యాల లలితాకృష్ణ, లిక్కి మమతాకృష్ణారెడ్డి, ఏనుగు రాంరెడ్డి, బండారి మనోహర్, పెద్దబావి శ్రీనివాస్రెడ్డి, పెద్దబావి సుదర్శన్రెడ్డి, ప్రభాకర్రెడ్డి, నందు, కో-ఆప్షన్ సభ్యుడు జగన్మోహన్రెడ్డి, బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు రామిడి రాంరెడ్డి, బీఆర్ఎస్ నాయకులు, అధికారులు పాల్గొన్నారు.