రవీంద్రభారతి, జూన్ 23: ప్రముఖ సాహితీవేత్త డాక్టర్ ద్వానా శాస్త్రి జయంతి సందర్భంగా ప్రముఖ రచయిత డాక్టర్ కూరెళ్ల విఠలాచార్యకు ద్వానా శాస్త్రి స్మారక పురస్కారం ప్రదానం చేశారు. కిన్నెర ఆర్ట్స్ థియేటర్స్, ద్వానా సాహితీ కుటీరం సంయుక్త ఆధ్వర్యంలో శుక్రవారం రవీంద్రభారతిలోని సమావేశ మందిరంలో నిర్వహించిన కార్యక్రమానికి హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కె.లక్ష్మణ్ ముఖ్యఅతిథిగా హాజరై పురస్కారాన్ని ప్రదానం చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మానవతా విలువలు కోల్పోతున్న నేటి సమాజంలో సాహిత్య రంగానికి ద్వానా శాస్త్రి చేసిన సేవలను కొనియాడారు. ప్రభుత్వ సలహాదారుడు డాక్టర్ కేవీ రమణాచారి మాట్లాడుతూ ద్వానా శాస్త్రి స్మారక పురస్కారం విఠలాచార్యకు రావడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో మేడ్చల్ అదపు కలెక్టర్ డాక్టర్ ఏనుగు నరసింహారెడ్డి, ప్రముఖ సాహితీవేత్త డాక్టర్ వోలేటి పార్వతీశం, బైసా దేవదాస్, ద్వాదశి శశికాంత్, ముద్దాళి రఘురాం, తదితరులు పాల్గొన్నారు.