సిటీబ్యూరో, అక్టోబర్ 10 (నమస్తే తెలంగాణ)/హిమాయత్నగర్ : వినియోగదారుల కోసం పండుగ ముందే పసందైన దసరా బొనాంజా వేడుకలను తీసుకొచ్చింది. ఇప్పుడు గ్రేటర్లోని కస్టమర్లు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న వార్షిక ఈవెంట్గా మారింది. ది చైన్నయ్ షాపింగ్ మాల్, కేఎల్ఎం ఫ్యాషన్ మాల్, ఫ్రీడమ్ హెల్తీ కుకింగ్ ఆయిల్, సీఎంఆర్, బిగ్సీ, కేఫ్ నిలోఫర్, బ్యాంక్ ఆఫ్ బరోడా, పంజాబ్ నేషనల్ బ్యాంకు, నిస్సాన్, మహావీర్ స్కోడా,హోప్, టీ న్యూస్, కున్ హ్యుండాయ్, సుధాకర్ పైప్స్ తదితర వంటి సంస్థల భాగస్వామ్యంతో నమస్తే తెలంగాణ – తెలంగాణ టుడే ఆధ్వర్యంలో దసరా బొనాంజా వేడుకలు నిర్వహిస్తున్నది.ఇందులో భాగంగా మొదటి రోజు మంగళవారం హిమాయత్నగర్లోని లక్ష్మి నిస్సాన్ షోరూంలో లక్కీ డ్రా తీసి ఐదుగురు విజేతలను ఎంపిక చేశారు. పలువురు వినియోగదారుల సమక్షంలో ఏపీ, తెలంగాణ నిస్సాన్ ఏరియా సేల్స్ మేనేజర్ అశోక్ కుమార్ రెడ్డి, సేల్స్మెన్ రమేశ్ రెడ్డి, నమస్తే తెలంగాణ అడ్వర్టైజ్మెంట్ ఏజీఎం రాజిరెడ్డి, తెలంగాణ టుడే ఏడీవీటీ మేనేజర్ చరణ్ ఆనంద్ లక్కీ డ్రా తీశారు.
మొదటి బహుమతి సీఎంఆర్ షాపింగ్ మాల్లో వస్ర్తాలు కోనుగోలు చేసిన ఎం.నరేందర్, రెండో బహుమతి కేఎల్ఎం షాపింగ్ మాల్లో వస్ర్తాలు కోనుగోలు చేసిన శ్రీనివాస్, మూడో బహుమతి నిలోఫర్ కేఫ్ కస్టమర్ కవిత, టీసీఎస్ఎంలో వస్ర్తాలు కోనుగోలు చేసిన ఆజాదికి నాల్గో బహుమతి, లక్ష్మి నిస్సాన్ షోరూంలో కారు కోనుగోలు చేసిన రాజు ఐదో బహుమతులను గెలుచుకున్నారు.
నమస్తే తెలంగాణ-తెలంగాణ టుడే నిర్వహించే దసరా బొనాంజా ఉత్సవాల్లో మేము భాగస్వామ్యం కావడం ఆనందంగా ఉంది. దసరా సందర్భంగా వినియోగదారులకు ఆనందాన్ని అందించేందుకు ఈ లక్కీ డ్రా నిర్వహించడం సంతోషకరం. మొదటి లక్కీడ్రాలో విజేతలుగా నిలిచిన వారికి అభినందనలు. ఈ దసరా బొనాంజాతో నిస్సాన్ షోరూమ్కు మంచి ఆదరణ పెరిగింది. నగర వాసులకు బొనాంజాతో మంచి బహుమతులు వస్తున్నందున కొనుగోలుపై ఆసక్తి కనబరుస్తున్నారు.
– రమేశ్ రెడ్డి, లక్ష్మి నిస్సాన్ షోరూం సేల్స్మెన్
నమస్తే తెలంగాణ – తెలంగాణ టుడే ఆధ్వర్యంలో నిర్వహించిన దసరా బోనాంజాలో మొదటి బహుమతి గెలుచుకోవడం చాలా సంతోషంగా ఉంది. సీఎంఆర్ షాపింగ్ మాల్లో వస్ర్తాలు కోనుగోలు చేశాక అక్కడి సిబ్బంది కూపన్ ఇచ్చారు. కూపన్లో నా వివరాలు నింపి అక్కడ ఏర్పాటు చేసిన బాక్స్లో వేశా. లక్కీ డ్రాలో మొదటి బహుమతి గెలుచుకున్నట్లు నమస్తే తెలంగాణ ప్రతినిధులు ఫోన్ చేసి చెప్పడంతో ఆనందంగా ఉంది. నమస్తే తెలంగాణ దినపత్రిక యాజమాన్యం దసరా బొనాంజా నిర్వహించి బహుమతులు ఇచ్చినందుకు కృతజ్ఞతలు.
– ఎం.నరేందర్, మొదటి బహుమతి విజేత
ప్రతి ఏడాది నగరంలో ఎంపిక చేసిన ఔట్లెట్లలో కొనుగోలుదారుల కోసం నమస్తే తెలంగాణ – తెలంగాణ టుడే ఆధ్వర్యంలో దసరా బొనాంజా ఉత్సవాలు నిర్వహిస్తున్నాం. హిమాయత్నగర్లోని లక్ష్మి నిస్సాన్ షోరూంలో మొదటి డ్రా తీశాం. ఈ నెల 18వ తేదీ వరకు బొనాంజా కార్యక్రమం కొనసాగుతుంది. రకరకాలుగా షాపింగ్ చేసిన ఐదుగురు వినియోగదారులను లక్కీ డ్రా ద్వారా ఎంపిక చేసి, విజేతల వివరాలను నమస్తే తెలంగాణ- తెలంగాణ టుడే దిన పత్రికలలో ప్రచురించి వారికి తెలియజేస్తాం. ఆయా సంస్థల నుంచి కస్టమర్లకు నచ్చిన వస్తువులు కొనుగోలు చేసిన వారు అక్కడ అందజేసే కూపన్ను నింపి డ్రా బాక్స్లో వేయాలి. నమస్తే తెలంగాణ- తెలంగాణ టుడే దిన పత్రికలను పాఠకులు మరింత ఆదరించాలి. దసరా బొనాంజా కార్యక్రమానికి ప్రజల నుంచి మంచి స్పందన లభిస్తోంది.
– రాజిరెడ్డి, అడ్వర్టైజ్మెంట్ ఏజీఎం