గత 22 ఏండ్లుగా ఇసామియా బజార్లో ఎత్తైన దుర్గామాత విగ్రహాన్ని ఏర్పాటు చేస్తూ నవరాత్రులను నిర్వహిస్తున్న శ్రీ నవదుర్గా నవరాత్రి ఉత్సవ సమితి- తెలంగాణ గంగపుత్ర ఎడ్యుకేషన్ డెవలప్మెంట్ ఫౌండేషన్ ఈ సారి కూడా అంతకన్నా ఘనంగా వేడుకలు జరపనున్నది. 45 అడుగుల ఎత్తైన దుర్గామాతను శ్రీ చక్ర విశ్వరూపిణి అవతారంలో ప్రతిష్ఠించనున్నారు. ఈ నెల 7న పూజలు ప్రారంభించి 19న చాదర్ ఘాట్లోని విక్టరీ ప్లే గ్రౌండ్లో నిమజ్జనం చేయనున్నారు. కోల్కతా నుంచి రెడ్సీ సాండ్, గడ్డి, కట్టెలను ఉపయోగించి పర్యావరణ హిత ప్రతిమను తయారు చేసేందుకు 35 రోజుల నుంచి 22 మంది కళాకారులు అహోరాత్రులు శ్రమిస్తున్నారని ఫౌండేషన్ చైర్మన్ గులాబ్ శ్రీనివాస్ వివరించారు.