ఘట్కేసర్ టోల్ప్లాజా వద్ద వ్యర్థాలను డంపింగ్ చేస్తున్నారు. అంతటితో ఆగకుండా మున్సిపాలిటీ సిబ్బంది చెత్తను దహనం చేస్తున్నారు. దీంతో ఇక్కడి నుంచి వచ్చే పొగతో అవుటర్ రింగ్రోడ్డు పై నుంచి వచ్చిపోయే వాహనదారుల, ఊపిరి ఆడక ఉక్కిరిబిక్కిరవుతున్నారు.
పొగ, దుర్వాసనతో సమీపంలోని టోల్ ప్లాజా సిబ్బంది, లక్ష్మీనర్సింహాకాలనీ, సంస్కృతి టౌన్షిప్, అన్నోజిగూడ, యంనంపేట్ ప్రాంతాల వాసులు వ్యాధుల బారినపడుతున్నారు. ఈ విషయమై అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
– పోచారం, జూన్ 5