సిటీబ్యూరో, మే 6 (నమస్తే తెలంగాణ): బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ప్రభావంతో నగరంలో పలు చోట్ల తేలికపాటి జల్లులు కురిశాయి. శనివారం ఉదయం నుంచి రాత్రి 9గంటల వరకు బార్కాస్, చాంద్రాయణగుట్టలో అత్యధికంగా 1.3సెం. మీలు, కేపీహెచ్బీ సీఐడీ కాలనీలో 1.0సెం.మీలు, కాంచన్బాగ్లో 1.0సెం.మీలు, షేక్పేటలో 4.3 మిల్లీ మీటర్ల చొప్పున వర్షపాతం నమోదైనట్లు టీఎస్డీపీఎస్ అధికారులు వెల్లడించారు. ఆవర్తన ప్రభావంతో మరో మూడు రోజులు ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వానలు కురిసే అవకాశాలున్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు. అంతేకాకుండా నగరానికి ఎల్లో అలర్ట్ కొనసాగిస్తున్నట్లు తెలిపారు.