సిటీబ్యూరో, జూలై 17(నమస్తే తెలంగాణ): మొదటిసారి డ్రంకన్ డ్రైవ్లో పట్టుడితే మోటర్ వెహికిల్ యాక్ట్ సెక్షన్ 185 కింద రూ.10 వేల జరిమానా, ఆరు నెలల జైలు శిక్ష ఉందని సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు హెచ్చరిస్తున్నారు. డ్రంకన్ డ్రైవ్ లో పట్టుబడ్డ 106 మందికి స్థానిక కోర్టులు శుక్రవా రం 106 మందికి జైలు శిక్షను విధించాయి. ఇందు లో ఒక రోజు నుంచి 17 రోజుల వరకు మందుబాబులకు జైలు శిక్షలు పడ్డాయి. ఇలా మందుబాబు లు తరచు మద్యం సేవించి వాహనాలను నడిపి దొరికితే వారికి రూ.15 వేల జరిమానాతో పాటు రెండేండ్లు జైలు శిక్ష పడుతుందని సైబరాబాద్ ట్రాఫి క్ అధికారులు స్పష్టం చేశారు. డ్రైవింగ్ లైసెన్స్లు కూడా మూడు నెలల నుంచి శాశ్వతంగా రద్దయ్యే అవకాశముందని అధికారులు చెబుతున్నారు. మ ద్యం సేవించి వాహనం నడిపి మరణానికి కారకులై న వారిపై కచ్ఛితంగా 304 పార్ట్-2 కింద కేసులను నమోదు చేస్తున్నామన్నారు. ఈ సెక్షన్ కింద అభి యోగం రుజువైతే పదేండ్ల జైలు ఖాయమన్నారు. కాబట్టి డ్రంకన్ డ్రైవింగ్ చేయొద్దని సైబరాబాద్ పోలీసులు వాహనదారులకు విజ్ఞప్తి చేస్తున్నారు.