సిటీబ్యూరో, ఆగస్టు 16 (నమస్తే తెలంగాణ): మందుబాబుల కిక్కు దిగేలా చేశారు సైబరాబాద్ పోలీసులు. మద్యం తాగి వాహనాలు నడిపిన 308 మంది లైసెన్స్లు రద్దు చేయాలని ఆర్టీఏ అధికారులకు సిఫారసు చేశారు. సైబరా బాద్ కమిషనరేట్ పరిధిలో గత వారం రోజుల వ్యవధిలో నిర్వహించిన డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో పట్టుబడ్డ వారిని కోర్టుల్లో హాజరుపర్చారు. న్యాయ మూర్తులు వారికి ఒక రోజు నుండి 17 రోజుల వరకు జైలు శిక్ష విధించారు. కాగా.. సైబరాబాద్ పోలీసుల సిఫారసు మేరకు ఆర్టీఏ అధికారులు ఈ 308 మంది లైసెన్స్లను రద్దు చేయనున్నారు.