హైదరాబాద్ : హైదరాబాద్లో మరోసారి డ్రగ్స్ కలకలం సృష్టించాయి. రూ. 50 కోట్ల విలువైన 25 కిలోల డ్రగ్స్ను సీజ్ చేసినట్లు డీఆర్ఐ అధికారులు తెలిపారు. మెఫిడ్రిన్ తయారు చేసే 2 ల్యాబ్లను అధికారులు సీజ్ చేశారు. ఈ ల్యాబ్లను నిర్వహిస్తున్న ఏడుగురు వ్యక్తులను రెవెన్యూ ఇంటెలిజెన్స్ విభాగం అదుపులోకి తీసుకున్నది. ఈ నెల 21న హైదరాబాద్లో డీఆర్ఐ ప్రత్యేక ఆపరేషన్ చేపట్టి.. ఈ ఏడుగురిని అరెస్టు చేశారు. వీరిని కోర్టులో ప్రవేశపెట్టి జ్యుడీషియల్ రిమాండ్కు తరలించారు.
ఈ డ్రగ్స్ కేసులో ప్రధాన నిందితుడిని ఉత్తరప్రదేశ్లోని గోరఖ్పూర్లో డీఆర్ఐ అధికారులు పట్టుకున్నారు. రూ. 60 లక్షలతో పారిపోతుండగా అరెస్టు చేసినట్లు పేర్కొన్నారు. ఈ ఏడుగురిలో కొందరిపై గతంలోనే డ్రగ్స్ తయారీ కేసులు ఉన్నట్లు అధికారుల విచారణలో వెల్లడైంది. కొందరిపై హైదరాబాద్లో హత్య కేసులు, వడోదరలో దోపిడీ కేసులు ఉన్నట్లు పేర్కొన్నారు.