హైదరాబాద్ : డ్రగ్స్ రహిత రాష్ట్రంగా తీర్చిద్దేందుకు అధికారులు కృషి చేస్తున్నారు. ఎక్కడికక్కడ దాడులు నిర్వహిస్తూ డగ్స్, గంజాయి కట్టడికి చర్యలు తీసుకుంటున్నారు. తాజాగా సనత్నగర్లో(Sanatnagar) సైబరాబాద్ ఎస్వోటీ పోలీసులు దాడులు నిర్వహించి డ్రగ్స్ ముఠాను పట్టుకున్నారు. వారి వద్ద నుంచి నాలుగు గ్రాముల ఎండీఎంఏ, గంజాయిని(Ganja) స్వాధీనం చేసుకున్నారు. ఐదుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. జహీరాబాద్ నుంచి బస్సులో డ్రగ్స్ తీసుకొచ్చినట్లు పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.