హైదరాబాద్: హైదరాబాద్లో మరోసారి డ్రగ్స్ (Drugs) కలకలం సృష్టించాయి. నగరంలోని చైతన్యపురిలో (Chaitanyapuri) డ్రగ్స్ సరఫరా చేస్తున్న ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. ఆంధ్రప్రదేశ్లోని భీమవరానికి చెందిన కనకరాజు, లక్ష్మీనరసింహరాజు, హైదరాబాద్ జీడిమెట్లకు చెందిన జలిమ్ శ్యామ్రాయ్లను అదుపులోకి తీసుకున్నారు. గోవాకు చెందిన డ్రగ్ పెడ్లర్ హబీబ్ పరారీలో ఉన్నాడని పోలీసులు తెలిపారు. వారి నుంచి 5 గ్రాముల ఎండీఎఏ, 4 ఎల్ఎస్డీ, రెండు సెల్ఫోన్లు సీజ్ చేశామని చెప్పారు. ఇప్పటికే వీరిపై ఎన్డీపీఎస్ యాక్ట్ కింద కేసులు నమోదుచేసినట్లు వెల్లడించారు.