HCU | హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ (హెచ్సీయూ) క్యాంపస్లో విక్రయం కలకలం రేపింది. ఈగల్ టీమ్, గచ్చిబౌలి పోలీసులు నిర్వహించిన తనిఖీల్లో 17 మంది విద్యార్థులు గంజాయి సేవించినట్లు నిర్ధారణ అయింది. ఈ డ్రగ్స్ రాకెట్కు సంబంధించి అస్సాం నుంచి గంజాయి తెచ్చి విక్రయిస్తున్న హెచ్సీయూ పూర్వ విద్యార్థిని పోలీసులు అరెస్ట్ చేశారు. అతడి వద్ద నుంచి10 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. గంజాయి ఎక్కడ నుంచి వచ్చింది. ఎన్ని రోజులు నుంచి ఈ దందా కొనసాగుతుంది అనే కోణంలో విచారిస్తున్నారు.