జవహర్నగర్, నవంబర్ 3: వాహనాలు తనిఖీ చేస్తుండగా అనుమానాస్పదంగా తిరుగుతున్న స్కూటీని పట్టుకుని తనిఖీ చేయగా 50 గ్రాముల డ్రగ్స్ లభ్యమయ్యాయి. ఈ ఘటన జవహర్నగర్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. సర్కిల్ ఇన్స్పెక్టర్ సీతారాం తెలిపిన ప్రకారం, కుమావత్ చిల్లారం, మోహన్లాల్ చౌదరి బాలాజీనగర్లో వ్యాపారం చేస్తూ జీవనం సాగించేవారు.
సులభంగా డబ్బులు సంపాదించటానికి అలవాటు పడుతూ రాజస్థాన్ నుంచి తక్కువ ధరకు డ్రగ్స్ తీసుకువచ్చి తెలంగాణలో అమ్ముతూ సొమ్ము చేసుకుంటున్నారు. ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో వాహనాల తనిఖీ చేస్తుండగా, నిందితులు పట్టుబడ్డారు. 50 గ్రాముల ఓపీఎం డ్రగ్స్, రెండు సెల్ఫోన్లు, స్కూటీని స్వాధీనం చేసుకున్నారు. నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు రిమాండ్కు తరలించారు.