హైదరాబాద్: నగర శివార్లలోని బీఎన్రెడ్డి నగర్ (BN Reddy Nagar) చౌరస్తాలో ఓ అంబులెన్స్ (Ambulance) ప్రమాదానికి (Road accident) గురైంది. మంగళవారం తెల్లవారుజామున ఇబ్రహింపట్నం (Ibrahimpatnam) నుంచి వస్తున్న అంబులెన్స్ అదుపుతప్పి బీఎన్రెడ్డి వద్ద డివైడర్ను ఢీకొట్టి బోల్తా పడింది. దీంతో తీవ్రంగా గాయపడిన డ్రైవర్ అపస్మారక స్థితిలోకి వెళ్లాడు. అయితే అందులో ఉన్న ఆక్సిజన్ సిలిండర్ (Oxygen cylinder) పేలడంతో అంబులెన్స్ ధ్వంసమైంది. ఈ క్రమంలో అతడు మృతిచెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం దవాఖానకు తరలించారు.
కాగా, మలక్పేటలోని (Malakpet) ఓ దవాఖానలో చికిత్స పొందిన రోగిని ఇంటివద్ద వదిలి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు. మృతుడిని మహేశ్గా గుర్తించారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. అయితే ప్రమాద సమయంలో రోడ్డుపై ఎవరూ ఇతర వాహనాలు లేకపోవడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు.