సిటీ బ్యూరో, సెప్టెంబర్ 22 (నమస్తే తెలంగాణ): నగరానికి తాగునీటిని సరఫరా చేసే మంజీరా ఫేజ్-2లో కలబ్గూర్ నుంచి హైదర్నగర్ వరకు ఉన్న 1500 ఎంఎం డయా పీఎస్సీ పంపింగ్ మెయిన్కు వివిధ ప్రాంతాల్లో భారీ లీకేజీలు ఏర్పడ్డాయి. లీకేజీలను అరికట్టేందుకు ఈనెల 24 ఉదయం 6 గంటల నుంచి 25న ఉదయం 6 గంటల వరకు మరమ్మతు పనులు చేపట్టనున్నట్లు జలమండలి అధికారులు తెలిపారు.
24 గంటల పాటు ఓ అండ్ ఎం డివిజన్-17లోని ఆర్సీపురం, అశోక్నగర్, జ్యోతినగర్, లింగంపల్లి, చందానగర్, గంగారం, మదీనాగూడ, మియాపూర్లో నీటి సరఫరాకు అంతరాయం కలగనున్నట్లు తెలిపారు. అదేవిధంగా ఓ అండ్ ఎం డివిజన్-22లోని బీరంగూడ, అమీన్పూర్, ట్రాన్స్మిషన్ డివిజన్-2లోని ఆఫ్ టేక్ పాయింట్స్, బల్క్ కనెక్షన్లు, ఓ అండ్ ఎం డివిజన్-6లోని ఎర్రగడ్డ, ఎస్ఆర్ నగర్, అమీర్పేటతో పాటు ఓ అండ్ ఎం డివిజన్-9 పరిధిలోని కేపీహెచ్బీ, కూకట్పల్లి, భాగ్యనగర్ కాలనీ, ప్రగతి నగర్లో నీటి సరఫరా నిలిపేయనున్నట్లు వెల్లడించారు. పైన పేర్కొన్న వినియోగదారులు నీటిని పొదుపుగా వాడుకోవాని సూచించారు.