పహాడీషరీఫ్, జనవరి 18: కాలనీలో పారుతున్న ఏండ్లనాటి మురుగు సమస్యకు శాశ్వత పరిష్కారం లభించిందని కాలనీ వాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. జల్పల్లి మున్సిపాలిటీ పరిధిలోని 19వ వార్డులో గత కొన్నేండ్లుగా అంతర్గత డ్రైనేజీ వ్యవస్థ లేకపోవడంతో రహదారి మధ్యలో మురుగు నీరు పారేది.. వార్డు కౌన్సిలర్ పల్లపు శంకర్ నాలుగు నెలల కిందట మంత్రి సబితా ఇంద్రారెడ్డికి ప్రజా సమస్యలను వివరించి, పరిష్కరించాలని కోరారు. సమస్యను తెలుసుకున్న మంత్రి వెంటనే రూ.15 లక్షలు నిధులు విడుదల చేశారు. దీంతో ఏండ్ల నుంచి ఉన్న మురుగు నీటి సమస్యకు శాశ్వత పరిష్కారం లభించిందని కాలనీ వాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
సంతోషంగా ఉంది..
కాలనీ మధ్యలో మురుగు పారింది. రహదారిలో నడవలేని పరిస్థితి. దుర్వాసన, దోమల వృద్ధితో ఇబ్బందులు పడ్డాం. చిన్నారులు వృద్ధులు ఇబ్బందు పడ్డా రు. నూతనంగా డ్రైనేజీ ఏర్పాటుతో మురుగు సమస్య తీరింది. కాలనీ వాసులమందరం పండుగను చాలా సంతోషంగా చేసుకున్నాం.
మంత్రి సహకారంతో అభివృద్ధి
వార్డులో మురుగు సమస్య లేకుండా శాశ్వత పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తున్నా.. టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే కాలనీలు, బస్తీల్లో దశలవారీగా అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. మంత్రి సబితా ఇంద్రారెడ్డికి సమస్యను విన్నవించగానే సానుకూలంగా స్పందిస్తున్నారు. చైర్మన్ అబ్దుల్లా సాది, కమిషనర్ జీపీ కుమార్ సహకరించారు. పనులు పూర్తయ్యాయి.