వ్యవసాయ యూనివర్సిటీ, నవంబర్ 18: ప్రతి మొక్క ఆరోగ్యంగా పెరిగి మంచి ఫలితాలివ్వాలంటే మనమంతా నిరంతరం కృషి చేయాలని, భారత వ్యవసాయ పరిశోధనా మండలి డిప్యూటీ డైరెక్టర్ జనరల్ డా.ఉదయ్సింగ్ గౌతమ్ అన్నారు. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ ప్రొ.వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆడిటోరియంలో శనివారం జరిగిన అంతర్జాతీయ సదస్సు ముగింపు సందర్భంగా సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా మాట్లాడారు.
‘మొక్కల ఆరోగ్య నిర్వహణ ఆవిష్కరణలు -సుస్థిరత’ అనే అంశంపై సుదీర్ఘ చర్చ జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, సుస్థిర వ్యవసాయాభివృద్ధికి పరిశోధనలు శ్రీకారం చుట్టాలన్నారు. భారత వ్యవసాయ పరిశోధన మండలికి దిశానిర్ధేశ, సుస్థిర వ్యవసాయ అభివృద్ధి ప్రధానం అన్నారు. శాస్త్రవేత్తలు శిక్షణా కార్యక్రమాలు, సామర్ధ్యం పెంపు కార్యక్రమాలు రూపొందించాలన్నారు. ఉత్తమ పరిశోధనా పత్రాలను శాస్త్రవేత్తకు పురస్కారాలను అందజేశారు.
ప్లాంట్ ప్రొటెక్షన్ అసోసియోషన్ ఫెలోఫషిఫ్లను 37 మంది శాస్రతవేత్తలకు అందజేశారు. సమావేశలో పీపీఏఐ అధ్యక్షలు డా.శరత్ బాబు, ఐఐఓఆర్ మాజీ డైరెక్టర్ డా. కేఎస్ వరప్రసాద్, డా.షేక్ మీరా, డా.జల్లా సత్యనారాయణ, డా.జగదీశ్వర్, టీవీకే సింగ్, డా.నరేందర్రెడ్డి, పరమేశ్వరి, డా. రెహమాన్ పాల్గొని పలు సూచనలు చేశారు.