హైదరాబాద్: నగరంలోని బంజారాహిల్స్లో (banjarahills) బిల్డింగ్పైనుంచి పడి ఓ డాక్టర్ అనుమానాస్పదంగా మృతిచెందాడు. బంజారాహిల్స్ రోడ్ నంబర్ 12లో మినిస్టర్స్ క్వార్టర్స్ ఎదురుగా ఉన్న ఓ హోటల్ ఆరో అంతస్తు పైనుంచి పడి డాక్టర్ మృతిచెందాడు. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు నిర్మాణంలో ఉన్న లిఫ్ట్ గుంత నుంచి మృతదేహాన్ని వెలికితీశారు. మృతుడిని పంకజ్ కుమార్ జైన్గా గుర్తించారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం దవాఖానకు తరలించారు.
కాగా, డాక్టర్ పంకజ్ కుటుంబం.. కూతురు వివాహ సంబంధం గురించి మాట్లాడటానికి మూడు రోజుల క్రితం ఇండోర్ నుంచి హైదరాబాద్ వచ్చిందని పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఇది హత్యా లేదా ఆత్మహత్యా అనే కోణంలో విచారిస్తున్నారు.