ఎర్రగడ్డ, ఫిబ్రవరి 25: మహిళా సాధికారత దిశగా వడివడిగా అడుగులు వేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ అన్నారు. బోరబండ డివిజన్కు చెందిన 57 మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను శనివారం ఆయన పంపిణీ చేశారు. ఈ సందర్భంగా గోపీనాథ్ మాట్లాడుతూ సంక్షేమం, అభివృద్ధికి కేరాఫ్ అడ్రస్గా రూపు దిద్దుకున్న తెలంగాణను ఇతర రాష్ర్టాలు అనుసరిస్తున్నాయని పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ అమలుపర్చుతున్న పథకాలను నేడు యావత్ దేశ ప్రజలు గమనిస్తున్నారన్న వాస్తవాన్ని బీజేపీ నేతలు గ్రహించాలన్నారు. మహిళా సాధికారత కోసం సీఎం కేసీఆర్ చేస్తున్న కృషి ఆయనకు మహిళా బంధుగా పేరు తెచ్చిందనటంలో అతిశయోక్తి లేదని పేర్కొన్నారు. కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ వంటి పథకాలు పేదింటి ఆడపిల్లల తల్లిదండ్రులకు వరాలుగా మారాయని వివరించారు. లబ్దిదారులకు చెక్కులతో పాటు తన తరపున కానుకలను ఎమ్మెల్యే గోపీనాథ్ అందజేశారు. కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షుడు కృష్ణమోహన్, విజయకుమార్, కోఆర్డినేటర్ విజయసింహ, ఇన్ఛార్జి సయ్యద్సిరాజ్, పార్టీ నేతలు బాబానాయక్, ధర్మ, బాబూరావు, ఏడీ మధు, జైభీమ్ యాదగిరి, బొట్టుశివ, దేవమణి, కవిత, యూసుఫ్, ఫయాజ్ఖాన్, సర్దార్, శివకుమార్ గుప్త తదితరులు పాల్గొన్నారు.