ముషీరాబాద్ : అనారోగ్యంతో బాధపడుతూ వివిధ ఆసుపత్రులలో చికిత్స పొందిన పలువురికి సిఎం సహాయ నిధి ద్వారా మంజురైన ఆర్థిక సహాయాన్ని(చెక్కులు) ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ సోమవారం పంపిణీ చేశారు. నియోజకవర్గంలోని ముషీరాబాద్ డివిజన్కు చెందిన 7 మంది లబ్దిదారులకు రూ 3.57 లక్షల ఆర్థిక సహాయాన్ని (చెక్కులను) అందచేశారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ యేటా వేలాది మంది పేద, మధ్య తరగతి ప్రజలకు సిఎం సహాయ నిధి ద్వారా ఆర్థిక చేయూతనందించడం జరుగుతుందని, ఈ అవకాశాన్ని పేదలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ పార్టీ ముషీరాబాద్ డివిజన్ అధ్యక్షుడు కాడబోయిన నర్సింగ్ ప్రసాద్, నాయకులు సాంబశివరావు, శ్రీధర్రెడ్డి, లక్ష్మణ్ గౌడ్, శివముదిరాజ్, గోవింద్, అజయ్ముదిరాజ్, జీ.రాజు, శ్రీకాంత్ గౌడ్, బాల్రాజ్ గౌడ్, బిక్షపతి యాదవ్, ఎయిర్టెల్ రాజు, రజినీ, శోభ, మేరీ దితరులు పాల్గొన్నారు.